సౌతాఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా (Team India) ఓటమిపాలైంది. తొలి ఓటమి నుంచి తేరుకున్న సౌతాఫ్రికా అద్భుత విజయాన్నందుకుంది. గురువారం న్యూ చంఢీగడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 51 పరుగుల తేడాతో గెలుపొందింది. టీ20ల్లో 210+ పరుగుల ఛేదనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 7 సార్లు ప్రత్యర్థి జట్లు 210+ స్కోర్లు చేయగా, అన్నింటిలోనూ భారత్ ఓడింది.
Read Also: IND Loss: భారత్కు ఘోర పరాజయం
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచు
నిన్న సౌతాఫ్రికా 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 162 రన్స్కే టీమ్ఇండియా (Team India) ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 2023లో విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు IND హయ్యెస్ట్ ఛేజింగ్ స్కోర్.కాగా, ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ డిసెంబరు 14న ధర్మశాలలో జరగనుంది.

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: