బంగ్లాదేశ్, భారత్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఇప్పుడు క్రీడారంగంపై, తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 2026 టీ20 ప్రపంచకప్ (T20 World Cup) లో భాగంగా భారత్లో జరగాల్సిన తమ మ్యాచ్ల వేదికను మార్చాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని కోరుతూ ఐసీసీకి అధికారికంగా లేఖ రాయాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ను ఆదేశించింది.
Read also: Mustafizur Rahman: KKR తప్పించడంపై ముస్తాఫిజుర్ ఏమన్నారంటే?
బీసీసీఐ తలొగ్గి ఈ నిర్ణయం
ఈ పరిణామం ఇరు దేశాల క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ముస్తాఫిజుర్ రెహమాన్ విడుదల.. బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ముస్తాఫిజుర్ రెహమాన్ను తన స్క్వాడ్ నుంచి విడుదల చేసింది.బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కొన్ని మతతత్వ శక్తుల ఒత్తిడికి బీసీసీఐ తలొగ్గి ఈ నిర్ణయం తీసుకుందని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది.

భారత్లో తమ ఆటగాళ్లకు భద్రత లేదని వారు వాదిస్తున్నారు. ఈ వరుస పరిణామాలు ఐపీఎల్ ప్రసారాలపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయి.షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ ఫిబ్రవరి 7న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో తమ ప్రపంచకప్ ప్రస్థానాన్ని ప్రారంభించాల్సి ఉంది.ఈ వివాదంపై బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది చాలా విచారకరమైన సంఘటన. ముస్తాఫిజుర్ కేకేఆర్లో ఆడుతుంటే మేమంతా ఆ జట్టుకు మద్దతు ఇచ్చేవాళ్లం. బీసీసీఐ చర్య మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది” అని బీసీబీ మాజీ డైరెక్టర్ ఖలీద్ మహమూద్ అన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: