టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2026) లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో సూపర్ 8 దశకు అర్హత సాధించింది. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన గ్రూప్-సి మ్యాచ్లో నేపాల్ క్రికెట్ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ విజయంతో కరీబియన్ జట్టు పాయింట్ల పట్టికలో కీలక స్థానాన్ని సంపాదించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్కు కెప్టెన్ నిర్ణయం సరైనదని బౌలర్లు నిరూపించారు.
Read Also: 1st T20I: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
జాసన్ హోల్డర్ (4/27) అద్భుత బౌలింగ్తో నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్ను దెబ్బతీశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, దీపేంద్ర సింగ్ ఐరీ (47 బంతుల్లో 58) ఒంటరి పోరాటం చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. చివర్లో సోంపాల్ కమీ (15 బంతుల్లో 26) వేగంగా ఆడటంతో నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేయగలిగింది.అనంతరం 134 పరుగుల సులభ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్కు ఓపెనర్ బ్రాండన్ కింగ్ (22) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.

అధికారికంగా నిష్క్రమించిన నేపాల్
అతను ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్మెయర్ (32 బంతుల్లో 46 నాటౌట్), మరో ఓపెనర్, కెప్టెన్ షాయ్ హోప్ (44 బంతుల్లో 61 నాటౌట్)తో కలిసి విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ రెండో వికెట్కు అజేయంగా 91 పరుగులు జోడించడంతో విండీస్ కేవలం 15.2 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.విండీస్ కు ఇది వరుసగా మూడో విజయం కాగా, ఈ గెలుపుతో సూపర్ 8లో అడుగుపెట్టింది. మరోవైపు, ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓటములతో నేపాల్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: