T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ 7 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆఖరి ఓవర్ వరకు సాగిన ఈ పోరులో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ను కట్టడి చేశారు.
Read Also: T20 World Cup 2026: అభిషేక్ శర్మ కు అండగా సంజూ శాంసన్
అహ్మదాబాద్లో ఫైనల్ ఫైట్: కివీస్తో భారత్ ఢీ!
ఈ విజయంతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్కు చేరిన జట్టుగా భారత్ (15 ఫైనల్స్) ఆస్ట్రేలియా (14 ఫైనల్స్) రికార్డును బద్దలు కొట్టింది. ఫైనల్లో భారత్ న్యూజిలాండ్తో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడనుంది. 2024లో టైటిల్ గెలిచిన భారత్.. మరోసారి ప్రపంచ ఛాంపియన్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగుల భారీ స్కోర్ చేసింది.. సంజూ శాంసన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. శివమ్ దూబే(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 43), ఇషాన్ కిషన్(18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 39) మెరుపులు మెరిపించారు. చివర్లో తిలక్ వర్మ(7 బంతుల్లో 3 సిక్సర్లతో 21), హార్దిక్ పాండ్యా(12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27)దూకుడుగా ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్(2/40), ఆదిల్ రషీద్(2/41) రెండేసి వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమిపాలైంది. జాకోబ్ బెతెల్(48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లతో 105 ) శతకంతో ఒంటరి పోరాటం చేయగా.. విల్ జాక్స్(20 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(2/38) రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా(1/33), వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: