టీ20 ప్రపంచకప్ (T20 WC) ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. భారత్, శ్రీలంక సంయుక్త వేదికలుగా జరగనున్న ఈ పొట్టి ప్రపంచకప్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని టోర్నమెంట్కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈసారి ప్రపంచకప్లో పాల్గొంటున్న అన్ని జట్లు ప్రమాదకరంగానే ఉన్నాయని, కానీ వాటన్నింటిలోకీ భారత్ మరింత డేంజరస్ టీమ్గా కనిపిస్తోందని ధోని అభిప్రాయపడ్డారు. మన కుర్రాళ్లు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని చెప్పారు.
Read Also: Maharashtra: క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
ఇలాంటి సమయంలో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది
పొట్టి ఫార్మాట్ లో ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, భారత జట్టులోని ఆటగాళ్లు అందరికీ ఒత్తిడిలో ఆడిన అనుభవం పుష్కలంగా ఉందని అన్నారు. ఎవరు ఏ పాత్ర పోషించాలో జట్టులోని సభ్యులకు స్పష్టంగా తెలుసని ధోనీ చెప్పారు. మంచి జట్టుకు ఉండాల్సిన లక్షణాలన్నీ టీమ్ ఇండియాలో ఉన్నాయని వివరించారు.మ్యాచ్ జరిగే వేదికల్లో వాతావరణం తనను కలవరపరుస్తోందని ధోనీ చెప్పారు.
శీతాకాలం కావడంతో కొన్ని నగరాల్లో మంచు కురుస్తోందని, మ్యాచ్ పై దీని ప్రభావం చాలా ఉంటుందని వివరించారు. ఇది చాలా విషయాలను ప్రభావితం చేస్తుందని, తాను ఆడుతున్న సమయంలోనూ డ్యూ (మంచు) అంటే భయాందోళనలకు గురయ్యానని చెప్పారు. ఇలాంటి సమయంలో టాస్ కీలక పాత్ర పోషిస్తుందని ధోని చెప్పుకొచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: