2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 (T20) ప్రపంచకప్కు సంబంధించిన టికెట్ల అమ్మకాలను ఈరోజు ప్రారంభించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది.భారత కాలమానం ప్రకారం, ఈ రోజు (డిసెంబరు 11) సాయంత్రం 6:45 గంటల నుంచి https://tickets.cricketworldcup.com/ వెబ్సైట్లో టికెట్లు అందుబాటులో ఉంటాయి. భారత్లో కొన్ని వేదికల్లో టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచి ప్రారంభం కానుండటం విశేషం.
Read Also: BCCI: కోహ్లీ, రోహిత్ జీతాలు తగ్గించనున్న బీసీసీఐ?
మ్యాచ్లకు ఆతిథ్యం
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ పదో ఎడిషన్ మెగా టోర్నీ, 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ టోర్నీ (T20) లో 55 మ్యాచ్లు ఉంటాయి. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతాతో పాటు శ్రీలంకలోని కొలంబో (రెండు వేదికలు), క్యాండీ నగరాలు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: