हिन्दी | Epaper

Sunrisers Hyderabad: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

Sharanya
Sunrisers Hyderabad: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో నేడు మరో రసవత్తరమైన రోజు. రెండు హైవోల్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కానుంది. సీజన్‌లో రెండు జట్లు మంచి ఫామ్‌లో ఉండటంతో పోరు ఆసక్తికరంగా మారనుంది.

టాస్ & జట్లు:

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తాము ముందుగా భారీ స్కోరు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం SRH జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. పేసర్ సిమర్జీత్ సింగ్ స్థానంలో జీషన్ అన్సారీ జట్టులోకి వచ్చాడు. అతను టీమ్‌కు అదనపు బలాన్ని అందించగలడని భావిస్తున్నారు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోనూ మార్పులు జరిగాయి. సమీర్ రిజ్వీ స్థానంలో కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవలే అతనికి కొన్నిరోజుల కిందట కుమార్తె పుట్టిన సంగతి తెలిసిందే కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు జట్టులోకి తిరిగి రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం మైదానం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. స్పిన్నర్లకూ కొంతమేరకు సహకారం లభించే అవకాశం ఉంది. ఈ మైదానంలో టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేయడమే ఉత్తమ ఎంపిక. భారీ స్కోరు కట్టబెట్టేలా సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ సిద్ధంగా ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870