భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టు దిశగా ప్రయాణం ప్రారంభమైంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ నేతృత్వంలో, సీనియర్ స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli, Rohit Sharma) లతో కూడిన తొలి బృందం ఈరోజు ఉదయం ఆస్ట్రేలియాకు బయల్దేరింది.
Read Also: Ranji Trophy : నేటి నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం
ఇది క్రికెట్ ప్రపంచానికి ప్రత్యేకంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న పర్యటన, ఎందుకంటే సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ, రోహిత్ తిరిగి అంతర్జాతీయ మ్యాచ్లకు తిరిగి వచ్చారు. ముఖ్యంగా, వీరు జట్టులో ఉన్నప్పటికీ, కెప్టెన్గా యువ శుభ్మన్ గిల్ (Shubman Gill) ఉండడం ఈ సిరీస్ను మరింత ప్రత్యేకతను కలిగిస్తుంది.
జట్టులోని మిగిలిన సభ్యులు, సహాయక సిబ్బందితో కూడిన రెండో బృందం ఈరోజు రాత్రి 9 గంటలకు ఆస్ట్రేలియా (Australia) కు బయల్దేరనుంది. అక్కడికి చేరుకున్నాక భారత ఆటగాళ్లు అక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం తీసుకుంటారు. అనంతరం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొని పరిమిత ఓవర్ల సిరీస్కు సిద్ధమవుతారు.

ఆ తర్వాత 23న అడిలైడ్ ఓవల్
ఈ పర్యటనలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈనెల 19న పెర్త్ స్టేడియం (Perth Stadium) లో జరిగే తొలి వన్డేతో ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 23న అడిలైడ్ ఓవల్, 25న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (Sydney Cricket Ground) లో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి.
అనంతరం 29 నుంచి టీ20 సిరీస్ మొదలవుతుంది.విదేశీ గడ్డపై తమ అద్భుతమైన ఫామ్ను కొనసాగించాలని భావిస్తున్న టీమిండియా (Team India) కు ఈ పర్యటన ఒక అగ్నిపరీక్షగా నిలవనుంది. చివరిసారిగా 2020-21లో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు భారత్ 1-2 తేడాతో వన్డే సిరీస్ను కోల్పోయి, అదే తేడాతో టీ20 సిరీస్ను గెలుచుకుంది.
ఈసారి ఎలాగైనా మెరుగైన ప్రదర్శన చేయాలని యువ కెప్టెన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలోని జట్టు పట్టుదలగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: