క్రికెట్ ప్రపంచంలో కెప్టెన్సీ అనేది ఒక జట్టును విజయం వైపు తీసుకెళ్లే ప్రధానమైన అంశం. భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వ పటిమపై విశేషంగా ప్రశంసలు కురిపించారు. ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో పాల్గొన్న ద్రవిడ్, రోహిత్తో తన అనుబంధం, అతని నాయకత్వ లక్షణాలు, కెప్టెన్గా చూపిస్తున్న పటిమపై విశదీకరించారు.”ఒక కోచ్గా నా దృష్టిలో జట్టు ఎల్లప్పుడూ కెప్టెన్దే అయి ఉండాలి. కోచ్ కంటే కెప్టెన్నే ఆటగాళ్లు ఎక్కువగా అనుసరిస్తారు. అందుకే కెప్టెన్ నిర్ణయాలకు మద్దతుగా నిలవడం చాలా అవసరం” అని ద్రవిడ్ తన కోచింగ్ తత్వాన్ని వివరించారు.
ఆటగాళ్ల మధ్య అనుబంధం బలంగా ఉండాలని
ఈ సందర్భంలో రోహిత్ శర్మ (Rohit Sharma) ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “రోహిత్ మొదటి రోజు నుంచే జట్టును ఎలా ముందుకు నడిపించాలన్న విషయంపై స్పష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు.జట్టు వాతావరణం సానుకూలంగా ఉండాలని, ఆటగాళ్ల మధ్య అనుబంధం బలంగా ఉండాలని ఎప్పుడూ ఆకాంక్షించేవాడు” అని చెప్పారు.రాహుల్ ద్రవిడ్ కోచ్గా, రోహిత్ శర్మ కెప్టెన్గా భారత జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. వీరిద్దరి సారథ్యంలో టీమిండియా 2023 ఆసియా కప్, 2024 టీ20 ప్రపంచకప్ (T20 World Cup) లను గెలుచుకుంది. అలాగే 2023 వన్డే ప్రపంచకప్లో ఫైనల్ వరకు దూసుకెళ్లింది. ఈ విజయాల వెనుక తమ మధ్య ఉన్న బలమైన బంధం కూడా ఒక కారణమని ద్రవిడ్ అభిప్రాయపడ్డారు.

సమయం గడపడం చాలా తేలికగా అనిపించేది
“రోహిత్తో నా బంధం కేవలం క్రికెట్కే పరిమితం కాలేదు. మేమిద్దరం సాయంత్రం వేళల్లో భోజనం చేస్తూ క్రికెట్ కాకుండా ఇతర విషయాల గురించి కూడా సరదాగా మాట్లాడుకునేవాళ్లం. అతనితో సమయం గడపడం చాలా తేలికగా అనిపించేది” అని ద్రవిడ్ చెప్పారు. అండర్-19 స్థాయి నుంచి చూసిన ఒక కుర్రాడు, అద్భుతమైన ఆటగాడిగా, నాయకుడిగా ఎదగడాన్ని చూడటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ద్రవిడ్ పేర్కొన్నారు.
రాహుల్ ద్రవిడ్ ఏ సంవత్సరంలో భారత జట్టులో అరంగేట్రం చేశారు?
1996లో లార్డ్స్లో ఇంగ్లాండ్పై టెస్ట్ మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్ భారత జట్టులో అరంగేట్రం చేశారు.
ద్రవిడ్ కెప్టెన్సీ ఎలా ఉంది?
రాహుల్ ద్రవిడ్ 2005-2007 మధ్య భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో భారత జట్టు వెస్టిండీస్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో సిరీస్ విజయాలు సాధించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: