అభిమానులు మురిసిపోయే క్షణాలు వచ్చేశాయి. సాకర్ సూపర్ స్టార్ మెస్సీ (Messi)…ఇవాళ సాయంత్రం 4 గంటలకు కోల్కతా నుంచి హైదరాబాద్ వస్తారు. అక్కడ నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్లి విశ్రాంతి తీసుకుని, వందమంది ఫ్యాన్స్తో మీట్ అండ్ గ్రీట్ పేరుతో ఫొటో సెషన్ పూర్తిచేస్తారు. రాత్రి 7 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో మెస్సి (Messi) మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్కు రాహుల్ గాంధీతో పాటుగా ఆయన మేనల్లుడు, తెలంగాణకు చెందిన మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు.
Read Also: Mitchell Starc: మరో రెండేళ్లు టెస్ట్ క్రికెట్ ఆడాలనుకుంటున్నా: స్టార్క్

ప్రత్యేక షీ టీమ్ లు ఏర్పాటు
స్టేడియంలో 39,000 ప్రేక్షకుల సామర్థ్యం ఉండగా, 450 సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణతో నిరంతర మానిటరింగ్ జరుగుతుంది. ముఖ్యంగా మహిళల భద్రత కోసం ప్రత్యేక షీ టీమ్లను ఏర్పాటు చేశారు. మెస్సీకి ‘జడ్’ కేటగిరీ భద్రత కల్పించనున్నారు. స్టేడియానికి చేరుకునే గ్రీన్ ఛానెల్ సౌకర్యం కూడా కల్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: