Max Hingo statement : టీ20 ప్రపంచకప్లో భాగంగా గురువారం అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్తో నమీబియా తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందు నమీబియా యువ ఫాస్ట్ బౌలర్ మాక్స్ హీంగో ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియాను 180 పరుగులకే పరిమితం చేయగలమని ఆయన పేర్కొన్నాడు.
“భారత్ మాపై 250 పరుగులు చేయడం అసాధ్యం. వారు గరిష్టంగా 180 వరకు వెళ్లొచ్చు. కానీ భారీ స్కోరు చేయనివ్వం” అని హీంగో తెలిపాడు. భారత జట్టు బ్యాటింగ్ బలంగా ఉన్నప్పటికీ, తమ బౌలింగ్ దాడితో వారిని అదుపులో పెట్టగలమని నమ్మకం వ్యక్తం చేశాడు.
Read Also: AP: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల

భారత్లో, 50 వేల మంది అభిమానుల మధ్య ఆడటం సవాలుగా ఉంటుందని అంగీకరించిన హీంగో, అదే సమయంలో అది గొప్ప అనుభవమని అన్నాడు. “కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ మా జట్టు నాపై విశ్వాసం ఉంచింది. నేను నా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పాడు.
నెదర్లాండ్స్తో జరిగిన గత మ్యాచ్లో ఒక కీలక క్యాచ్ డ్రాప్ కారణంగా ఓటమి చవిచూశామని, ఆ అనుభవం తమకు పాఠమైందని తెలిపాడు. జట్టుకు కన్సల్టెంట్ కోచ్గా ఉన్న గ్యారీ కిర్స్టెన్ అనుభవం ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా తనకు స్ఫూర్తి అని చెప్పిన హీంగో, సీనియర్ బౌలర్లు రూబెన్ ట్రంపెల్మన్, జేజే స్మిత్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని వెల్లడించాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: