తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను 17 పరుగుల తేడాతో ఓడించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం రాంచీలోని JSCA స్టేడియంలో దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul).. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో కాస్త కంగారు పడినట్లు తెలిపాడు.చాలా కాలం తర్వాత మేం వన్డే క్రికెట్ ఆడాం. ఆశించిన ఫలితాన్ని అందుకున్నాం.
Read Also: Virat Kohli: వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతా: కోహ్లీ
ఆట మెరుగుపడటానికి కూడా ఉపయోగపడుతుంది
వరుసగా వికెట్లు తీయడం మాకు కలిసొచ్చింది. మా బౌలర్లు ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేశారు. సఫారీ బ్యాటర్లు మమ్మల్ని ఒత్తిడికి గురి చేశారు. ఆఖరి వరకు అద్భుతంగా పోరాడారు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. జట్టు కోసం నేను ఏదైనా చేయడానికి సిద్దమే.
గత 2-3 సిరీస్ల్లో టీమిండియా మేనేజ్మెంట్ నాకు అప్పగించిన పాత్ర అదే. ఇది నా వ్యక్తిగత ఆట మెరుగుపడటానికి కూడా ఉపయోగపడుతుంది. రోహిత్, కోహ్లీ చెలరేగి ఆడుతుంటే చూడటం చాలా సరదాగా ఉంటుంది. వారు తమ బ్యాటింగ్తో ప్రత్యర్థులను పిచ్చోళ్లను చేస్తారు. వారి బ్యాటింగ్ను నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా.
వికెట్లు తీయడం మాకు కీలకం
డ్రెస్సింగ్ రూమ్లో వారు ఉంటే చాలా ఫన్గా ఉంటుంది. హర్షిత్ రాణా (Harshit Rana) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. వికెట్లు తీసే సామర్థ్యం అతనికి ఉంది. హైట్ ఎక్కువగా ఉండటం అతనికి కలిసొచ్చే అంశం. ఆఖరి ఓవర్లలో ఎక్కువ పరుగులిచ్చినా.. జట్టును గెలిపించే సత్తా అతనికి ఉంది.
అతను కొత్త బంతితో కూడా వికెట్లు తీయాలని ఆశిస్తున్నాం. కుల్దీప్ యాదవ్ తన పనిని తాను చేస్తున్నాడు. అతను వికెట్లు తీయడం మాకు కీలకం.’అని కేఎల్ రాహుల్ (KL Rahul) చెప్పుకొచ్చాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: