భారత క్రికెట్ అభిమానులు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)మరియు విరాట్ కోహ్లీ మధ్య ఎవరూ గొప్ప ఆటగాడన్న ప్రశ్నపై ఎప్పటి నుంచో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ చర్చకు ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ తనదైన శైలిలో తెరదించాడు. ఆయన కేవలం ఎవరూ బెస్ట్ అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే, మాస్టర్ బ్లాస్టర్ సచిన్కు ఓటు వేసాడు.

బార్మీ ఆర్మీ గేమ్లో రూట్ ప్రత్యుత్తరం
ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల సంఘం ‘బార్మీ ఆర్మీ’ (Barmy Army)నిర్వహించిన సరదా సెషన్ “దిస్ ఆర్ దట్”లో జో రూట్ పాల్గొన్నాడు. ఇందులో అతడిని విరాట్ కోహ్లీ మరియు సచిన్ టెండూల్కర్లలో ఎవరిని ఎంచుకుంటావని అడిగినప్పుడు, అతను ఎలాంటి సందేహం లేకుండా “సచిన్” అని బదులిచ్చాడు. ఇది కేవలం కోహ్లీపై మాత్రమే కాదు, బ్రియాన్ లారా, రికీ పాంటింగ్, జాక్ కలిస్ వంటి లెజెండ్స్ కంటే సచినే గొప్ప ఆటగాడని పేర్కొన్నాడు.
సచిన్ & కోహ్లీ రికార్డుల విశ్లేషణ
సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలతో 34,357 పరుగులు చేసి క్రికెట్ చరిత్రలో అగ్రస్థానంలో నిలిచారు. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 27,599 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో కోహ్లీకి మెరుగైన సగటు ఉండగా, టెస్టుల్లో సచిన్ ప్రదర్శన గొప్పదిగా నిలిచింది. అయితే కోహ్లీ టెస్టులు మరియు టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నందున, సచిన్ రికార్డును అందుకోవడం కోహ్లీకి అసాధ్యమే అన్న అభిప్రాయం నెలకొంది.
సచిన్ రికార్డుపై జో రూట్ దృష్టి
ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు (15,921) సచిన్ పేరిట ఉన్నా, జో రూట్ 13,543 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటీవలే ఆయన రాహుల్ ద్రవిడ్, రికీ పాంటింగ్లను అధిగమించాడు. ఈ పాయింట్లో అతడు సచిన్నే తన ఆదర్శంగా పేర్కొనడం విశేషం. ఇది కేవలం గౌరవం మాత్రమే కాక, సచిన్ స్థాయికి చేరే ప్రయత్నంగా కూడా చెప్పవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: