క్రికెట్ ప్రపంచంలో సుదీర్ఘకాలం పాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించిన ఇంగ్లాండ్ లెజెండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ (James Anderson) మరోసారి వార్తల్లో నిలిచారు. 704 టెస్టు వికెట్లు పడగొట్టిన ఘనత సాధించిన ఏకైక పేసర్గా చరిత్రలో తన పేరును లిఖించుకున్న ఆండర్సన్, తాజాగా భారత క్రికెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు అత్యంత ఇష్టమైన భారత క్రికెటర్ ఎవరో వెల్లడించారు. అందరికంటే ఎక్కువగా విరాట్ కోహ్లీ (James Anderson)తనను ఆకట్టుకున్నాడని పేర్కొన్నారు.
Read also: Damien Martin: కోమా నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్?

జేమ్స్ ఆండర్సన్ దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలకు బౌలింగ్ చేశారు.అయితే విరాట్ కోహ్లీతో సాగించిన పోరాటం అత్యంత చిరస్మరణీయమని ఆయన భావిస్తున్నారు. కోహ్లీ చూపించే దూకుడు, ఆటపై అతనికున్న నిబద్ధత ఆండర్సన్ను బాగా ఆకట్టుకున్నాయి. 2014 ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీని ఆండర్సన్ నాలుగు సార్లు ఔట్ చేసి ముప్పతిప్పలు పెట్టారు. కానీ 2018లో కోహ్లీ తిరిగి పుంజుకుని ఆండర్సన్ బౌలింగ్లో ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 593 పరుగులు సాధించి గట్టి సమాధానమిచ్చారు.
ఫేవరెట్ ప్లేయర్లు
*భారత్-విరాట్ కోహ్లీ
*ఆస్ట్రేలియా-షేన్ వార్న్
*దక్షిణాఫ్రికా-ఏబీ డివిలియర్స్
*శ్రీలంక-సనత్ జయసూర్య
*పాకిస్థాన్-బాబర్ ఆజం
*న్యూజిలాండ్-టిమ్ సౌథీ
*ఇంగ్లాండ్ -జో రూట్
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: