శ్రీలంక, భారత్ మహిళల (INDW vs SLW) మధ్య ఐదో మ్యాచ్కు రంగం సిద్దమైంది.. ఈ సిరీస్లో ఆడిన 4 మ్యాచ్లను టీమ్ ఇండియా గెలిచింది. చివరి పోరులోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఈ సిరీస్లో రెండోసారి టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు మళ్లీ బౌలింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్తో తమిళనాడు క్రికెటర్ జి.కమలిని టీ20ల్లో అరంగేట్రం చేస్తోంది. టాస్కు ముందు కెప్టెన్ హర్మన్ప్రీత్ చేతులు మీదుగా తను డెబ్యూ క్యాప్ అందుకుంది.టీమిండియా ఏకపక్షంగా శ్రీలంకను మట్టికరిపిస్తోంది.
Read Also: India head coach : BCCI గౌతమ్ గంభీర్ను తొలగించదా? కోచ్ భవిష్యత్తుపై రాజీవ్ శుక్లా క్లారిటీ
కమలిని తుది జట్టులోకి వచ్చింది
వైజాగ్లో రెండు విజయాలు.. ఆపై త్రివేండ్రంలోనూ లంకను బెంబేలెత్తించిన హర్మన్ప్రీత్ సేన వైట్వాష్ చేయాలనుకుంటోంది. హర్లీన్ డియోలో స్థానంలో 17 ఏళ్ల కమలిని తుది జట్టులోకి వచ్చిందని హర్మన్ప్రీత్ తెలిపింది. సమిష్టి వైఫల్యంతో సిరీస్ సమర్పించుకున్న శ్రీలంక రెండు మార్పులు చేసింది. కావ్య, షెహానీల బదులు ఇనొకా రణవీర, మాల్తి మడరను తుది జట్టులోకి తీసుకుంది. ఆటపట్టు బృందం ఓదార్పు విజయంతో సిరీస్ను ముగిస్తుందా? ఎప్పటిలానే టీమిండియాకు దాసోహమవుతుందా? చూడాలి.

భారత తుది జట్టు : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జి.కమలిని, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), రీచా ఘోష్(వికెట్ కీపర్), అమన్జోత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహ్ రానా, వైష్ణవీ శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.
శ్రీలంక తుది జట్టు : చమరి ఆటపట్టు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిశ దిల్హరి, నిలాక్షి డిసిల్వా, ఇమేశా దులానీ, కుశాని నుత్యంగన(వికెట్ కీపర్), రష్మిక సెవ్వండి, ఇనొక రణవీర, మాల్తి మడర, నిమేశ మధుషానీ.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: