సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ (IND Vs SA T20 series) ఆడే భారత జట్టును బీసీసీఐ (BCCI) ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ బుధవారం వెల్లడించింది. మెడ నొప్పితో సౌతాఫ్రికాతో టెస్ట్, వన్డే సిరీస్లకు దూరమైన శుభ్మన్ గిల్ టీ20 సిరీస్ (IND Vs SA T20 series) కు ఎంపికయ్యాడు. అయితే అతను ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.ఆసియా కప్ ఫైనల్కు ముందు గాయపడిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తిరిగి జట్టులో చేరాడు.
Read Also: IND vs SA 2nd ODI: సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం
తుది జట్లు
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దుబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.
తొలి టీ20 డిసెంబర్ 9న కటక్లో, రెండో టీ20 డిసెంబర్ 11న ముల్లాన్పూర్లో, మూడో టీ20 డిసెంబర్ 14న ధర్మశాలలో, నాలుగో టీ20 డిసెంబర్ 17న లక్నోలో, ఐదో టీ20 డిసెంబర్ 19న అహ్మదాబాద్లో జరగనున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: