ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా (IND vs SA) జట్టు సంచలనం సృష్టించింది. 124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత బ్యాటింగ్ లైనప్ను 93 పరుగులకే కుప్పకూల్చి 30 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ (4/21) తన స్పిన్ మాయాజాలంతో టీమిండియా పతనాన్ని శాసించాడు.
Read Also: Satya Jyoti: రోడ్డు ప్రమాదంలో వెయిట్లిఫ్టర్ సత్యజ్యోతి మృతి
ఈ విజయంతో రెండు మ్యాచ్ల సిరీస్లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికాకు ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం.124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 93 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 2 ఫోర్లతో 31) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్(0), కేఎల్ రాహుల్(1), ధ్రువ్ జురెల్(13), రిషభ్ పంత్(2), రవీంద్ర జడేజా(18), కుల్దీప్ యాదవ్(1 నాటౌట్), మహమ్మద్ సిరాజ్(0) తీవ్రంగా నిరాశపర్చారు. చివర్లో అక్షర్ పటేల్(26) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. తీవ్ర మెడనొప్పితో శుభ్మన్ గిల్ ఆసుపత్రిపాలైన సంగతి తెలిసిందే. దాంతో అతను బ్యాటింగ్కు రాలేదు.
ఎయిడెన్ మార్క్రమ్ ఒక వికెట్ దక్కింది
సౌతాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మర్(4/21)తో పాటు మార్కో జాన్సన్(2/15), కేశవ్ మహరాజ్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఎయిడెన్ మార్క్రమ్ ఒక వికెట్ దక్కింది. టెంబా బవుమా కెప్టెన్సీలో సౌతాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. టెస్ట్ల్లో అతని సారథ్యంలో సౌతాఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. ఈజీగా మ్యాచ్ గెలుస్తామనే అత్యుత్సాహం కూడా టీమిండియా కొంపముంచింది.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌటైంది.

ఎయిడెన్ మార్క్రమ్(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 31), వియాన్ మల్డర్(51 బంతుల్లో 3 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(5/27) ఐదు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించగా.. మహమ్మద్ సిరాజ్(2/47), కుల్దీప్ యాదవ్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఒక వికెట్ దక్కింది.అనంతరం భారత్ 189 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్(119 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39), వాషింగ్టన్ సుందర్(82 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా
రిషభ్ పంత్(45 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27), రవీంద్ర జడేజా(45 బంతుల్లో 3 ఫోర్లతో 27) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(3/35), సిమన్ హర్మర్(4/30) భారత్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ పడగొట్టారు. 30 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 153 పరుగులకు కుప్పకూలింది.
కెప్టెన్ టెంబా బవుమా(136 బంతుల్లో 4 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. కార్బిన్ బోష్ (37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25) అండగా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(4/50) నాలుగు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్(2/30), మహమ్మద్ సిరాజ్(2/2) రెండేసి వికెట్లు పడగొట్టారు.
జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్కు చెరో వికెట్ దక్కింది. దాంతో భారత్ ముందు 124 పరుగుల లక్ష్యం నమోదైంది. బవుమా, కార్బిన్ బోష్ 8వ వికెట్కు 44 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం మ్యాచ్ను సౌతాఫ్రికావైపు మలుపు తిప్పింది.
సంక్షిప్త స్కోర్లు:
దక్షిణాఫ్రికా: తొలి ఇన్నింగ్స్ 159, రెండో ఇన్నింగ్స్ 153 (టెంబా బవుమా 55 నాటౌట్; రవీంద్ర జడేజా 4/50).
భారత్: తొలి ఇన్నింగ్స్ 189, రెండో ఇన్నింగ్స్ 93 (వాషింగ్టన్ సుందర్ 31; సైమన్ హార్మర్ 4/21, మార్కో యన్సెన్ 2/15).
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: