ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL 2025) సీజన్ ఇప్పుడు క్రూసియల్ దశలోకి వచ్చేసింది. నేడు ఎలిమినేటర్ మ్యాచ్ ముచ్చటగా మొదలుకాబోతుంది. మైదానం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం. గుజరాత్ (Gujarat) టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (Indians) (MI) మైదానంలో తలపడేందుకు సిద్ధమయ్యాయి.ఈ మ్యాచ్ ఓన్లీ గేమ్కి కాదు, ఓటమి అంటే టోర్నీకి గుడ్బై. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కి చేరుతుంది. అంటే, ఐపీఎల్ ట్రోఫీకి చేరే మార్గంలో మరో అడుగు ముందుకు.

టాస్ విజేత – ముంబై ఇండియన్స్
మ్యాచ్ ప్రారంభానికి ముందు, ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచాడు. తొలుత బ్యాటింగ్ చేస్తామంటూ నిర్ణయం తీసుకున్నాడు. ముంబై మోమెంటమ్ కోసం బౌలర్ల మీద కాకుండా బ్యాట్స్మెన్ శక్తిపై నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బలమైన జట్టుతో బరిలోకి దిగాడు. సాయి సుదర్శన్, కుశాల్ మెండిస్ లాంటి యువ ఆటగాళ్లతో బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. అటు బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ ఉన్నారు.
గుజరాత్ ప్రధాన జట్టు
శుభ్మన్ గిల్ (కెప్టెన్)
సాయి సుదర్శన్
కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్)
షారుఖ్ ఖాన్
వాషింగ్టన్ సుందర్
రషీద్ ఖాన్
రాహుల్ తెవాటియా
మహ్మద్ సిరాజ్
గెరాల్డ్ కోయిట్జీ
ప్రసిధ్ కృష్ణ
ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ ఎలెవన్
ముంబై బ్యాటింగ్ లోనే కాదు, బౌలింగ్లోనూ ఫైర్ పవర్ ఉంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, బెయిర్స్టో వంటి స్టార్ ప్లేయర్లు జట్టులో ఉన్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఉండడం ఒక ప్లస్ పాయింట్.
ముంబై ప్రధాన జట్టు:
రోహిత్ శర్మ
జానీ బెయిర్స్టో (వికెట్ కీపర్)
సూర్యకుమార్ యాదవ్
తిలక్ వర్మ
హార్దిక్ పాండ్యా (కెప్టెన్)
మిచెల్ శాంట్నర్
జస్ప్రీత్ బుమ్రా
ట్రెంట్ బౌల్ట్
హోరాహోరీ పోరుకు రంగం సిద్ధం
ఇద్దరు కెప్టెన్లు ఈ సీజన్లో తమ కెప్టెన్సీని నిరూపించుకోవాలని చూస్తున్నారు. హార్దిక్ పాండ్యా కోసం ఇది మరింత వ్యక్తిగతంగా మారింది. గత సీజన్లో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు మాత్రం గుజరాత్పైనే పోరాడాల్సి వచ్చింది.ఇక గుజరాత్ టీమ్కి కూడా ఇది డూ-ఆర్-డై సిట్యుయేషన్. గిల్ కెప్టెన్సీతో జట్టు బలంగా ఉంది కానీ, టెంపర్మెంట్ టెస్ట్ అయ్యే రోజు ఇది.మ్యాచ్ రిజల్ట్ ఏదైనా గట్టిపోటీ మాత్రం ఖాయం.
Read Also : Nandini Agasara : ఏషియన్ అథ్లెటిక్స్ లో నందినికి స్వర్ణ పతకం