లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ (England) జట్ల మధ్య తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుతో పోలిస్తే ఇంగ్లండ్ ఇంకా 144 పరుగుల వెనుకబాటులో ఉంది.ప్రస్తుతం క్రీజులో హ్యారీ బ్రూక్ (Harry Brook) 57 పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. 77 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. అతనితో పాటు వికెట్ కీపర్ జేమీ స్మిత్ 29 పరుగులతో (45 బంతుల్లో 4 ఫోర్లు) ఉన్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం ఇంగ్లండ్ రికవరీలో కీలకంగా మారింది.
ఓలీ పోప్ సెంచరీ, బుమ్రా మ్యాజిక్
ఇంగ్లండ్ బ్యాటింగ్లో ఓలీ పోప్ మెరుపులు మెరిపించాడు. 137 బంతుల్లో 14 ఫోర్లతో 106 పరుగుల చక్కటి సెంచరీ చేశాడు. మరోవైపు బుమ్రా తన అనుభవాన్ని చాటుతూ మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. జాక్ క్రాలీ (4)ను వెంటనే అవుట్ చేసి దెబ్బతీశాడు. జో రూట్ (28) కూడా బుమ్రాకే వికెట్ సమర్పించుకున్నాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ను సిరాజ్ అవుట్ చేయగా, ఓలీ పోప్ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్కు పంపాడు.ఇందుకు ముందు భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 471 పరుగులు చేసింది. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ 101 పరుగులు చేయగా, కెప్టెన్ శుభ్మన్ గిల్ 147 రన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రిషభ్ పంత్ కూడా 134 పరుగులతో అద్భుతంగా రాణించాడు. కెఎల్ రాహుల్ 42 పరుగులు చేయగా, బ్యాటింగ్ పూర్తిస్థాయిలో బలంగా కనిపించింది.
ఇంగ్లండ్ బౌలింగ్లో స్టోక్స్ మెరిశాడు
ఇంగ్లండ్ బౌలింగ్లో కెప్టెన్ స్టోక్స్ 4 వికెట్లు తీసి మేం ఉన్నామంటూ చూపించాడు. జోష్ టంగ్ కూడా నాలుగు వికెట్లు పడగొట్టాడు. బ్రైడన్ కార్స్, బషీర్ తలో వికెట్ తీసుకున్నారు.ఇప్పటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ ఇంకా 144 పరుగులు వెనుక ఉంది. బ్రూక్, స్మిత్ భాగస్వామ్యం కొనసాగితే స్కోరు సమం చేసే అవకాశం ఉంది. కానీ, భారత్ మరో రెండు వికెట్లు తీస్తే మ్యాచ్ తిరుగుతుంది.
Read Also : Jasprit Bumrah: బుమ్రా , గంభీర్ మధ్య వాగ్వాదం.. కారణం ఏంటో తెలుసా?