ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం డామియన్ మార్టిన్ (Damien Martin) ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మెనింజైటిస్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై వారం రోజులుగా కోమాలో ఉన్న ఆయన ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత మిత్రుడు, మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ వెల్లడించారు. మార్టిన్ (Damien Martin)ప్రస్తుతం స్పృహలోకి వచ్చి మాట్లాడగలుగుతున్నారని, వైద్య చికిత్సకు మంచి స్పందన ఇస్తున్నారని తెలిపారు.డిసెంబర్ 27న తీవ్ర అస్వస్థతకు గురైన డామియన్ మార్టిన్ను గోల్డ్ కోస్ట్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్పించారు.
Read also: T20 World Cup: బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం
పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఆయనకు ఇండ్యూస్డ్ కోమాలో ఉంచి చికిత్స అందించారు. తాజాగా ఆయన కోమా నుంచి బయటపడటంతో అభిమానులు, క్రీడాలోకం ఊపిరి పీల్చుకుంది.“కోమా నుంచి బయటపడిన తర్వాత మార్టిన్ అద్భుతంగా కోలుకుంటున్నాడు. ఇది ఒక అద్భుతంలా ఉందని ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతని రికవరీ ఎంతో సానుకూలంగా ఉంది. త్వరలోనే ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించే అవకాశం ఉంది” అని గిల్క్రిస్ట్ తెలిపాడు.

అభిమానులు చూపిన ప్రేమ, పంపిన సందేశాలు మార్టిన్ కోలుకోవడంలో ఎంతో సహాయపడ్డాయని అతని అర్ధాంగి అమండా చెప్పినట్లు గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు.సొగసైన స్ట్రోక్ ప్లేతో పేరుగాంచిన మార్టిన్, ఆస్ట్రేలియా తరఫున 67 టెస్టులు, 208 వన్డే మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 13 సెంచరీలతో 4,406 పరుగులు, వన్డేల్లో 5 సెంచరీలతో 5,346 పరుగులు చేశాడు. ముఖ్యంగా 2004లో భారత్తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలవడం అతని కెరీర్లో ఒక ముఖ్యమైన ఘట్టం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: