దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో(61 బంతులు మిగిలుండగానే) భారీ విజయం సాధించింది. తద్వారా సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది.టీమిండియాపై దక్షిణాఫ్రికా, వన్డే సిరీస్ కోల్పోవడం కాస్త నిరుత్సాహ పరిచిందని SA మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) పేర్కొన్నారు.
Read Also: Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్
‘ఇది ఒక బ్యాడ్ డే. సిరీస్ డిసైడర్లో తప్పులకు తావుండకూడదు. టీమ్ ఇండియాకి శుభాకాంక్షలు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ(65*) అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్. నేను 20-20 మ్యాచుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని (Dale Steyn) ట్వీట్ చేశారు. IND-SA మధ్య 5 టీ20ల సిరీస్ డిసెంబర్ 9 నుంచి కటక్ వేదికగా ప్రారంభంకానుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: