Telugu News: Asia Cup 2025- భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై తీవ్ర వివాదం

Read Time:  1 min
Asia Cup 2025- భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై తీవ్ర వివాదం
Asia Cup 2025- భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై తీవ్ర వివాదం
FONT SIZE
GET APP

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా చర్చ చెలరేగింది. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న దేశంతో క్రీడలు ఆడకూడదంటూ అనేక వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదానికి ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ కూడా తనదైన రీతిలో జోడైంది. సోషల్ మీడియాలో(Social Media) షేర్ చేసిన గ్రాఫిక్‌లో “భారత్ తదుపరి మ్యాచ్” అని రాసి, ప్రత్యర్థి జట్టు పేరును ఉద్దేశపూర్వకంగా ఖాళీగా వదిలేశారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో, నెటిజన్ల నుంచి విపరీతమైన కామెంట్లు వెల్లువెత్తాయి. వివాదం పెరగడంతో, పంజాబ్ కింగ్స్ తమ ఎక్స్’ ఖాతా కామెంట్స్ సెక్షన్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.

Asia Cup 2025

సుప్రీంకోర్టులో పిటిషన్, కానీ విచారణ నిరాకరణ

ఇక మరోవైపు, ఈ మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. “సరిహద్దుల్లో సైనికులు ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోతుంటే, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశంతో క్రికెట్ ఆడటం తగదు” అని పిటిషనర్లు వాదించారు.

మ్యాచ్ జరుగడం వల్ల ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల భావాలు దెబ్బతింటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, సుప్రీంకోర్టు(Supreme Court) అత్యవసర విచారణకు నిరాకరించడంతో మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం జరగనుంది.

భారత్–పాకిస్థాన్ ఆసియా కప్ 2025 మ్యాచ్ ఎప్పుడు జరగనుంది?
ఎల్లుండి ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

పంజాబ్ కింగ్స్ ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది?
ప్రత్యర్థి జట్టైన పాకిస్థాన్ పేరును ఉద్దేశపూర్వకంగా ఖాళీగా వదిలి తమ నిరసన తెలియజేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Telugu News: Breaking News-సిక్కింలో కొండచరియలు విరిగి నలుగురు మృతి

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.