భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ టూర్కి సిద్ధమవుతున్న వేళ, రెండు పెద్ద ప్రకటనలు వెలువడ్డాయి. రోహిత్ శర్మ మే 7న, విరాట్ కోహ్లీ మే 12న టెస్ట్ క్రికెట్కి గుడ్బై చెప్పారు. ఈ నిర్ణయాలు ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేశాయి.ఈ ఇద్దరూ వేర్వేరు రోజుల్లో తమ రిటైర్మెంట్ను సోషల్ మీడియాలో ప్రకటించారు. అభిమానులు ఆ వార్తల్ని నిజం అనక నమ్మలేకపోయారు. మరింత ఆసక్తికరంగా, వీరిద్దరూ స్టేడియంలో గుడ్బై చెప్పకుండానే బయటపడ్డారు.మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే ఈ వ్యవహారంపై స్పందించారు. “ఇద్దరూ ఒకదాని తర్వాత మరొకరు రిటైర్ కావడం ఆశ్చర్యం. కోహ్లీ విషయంలో అయితే ఇది అస్సలు ఊహించలేదు. అతనిలో ఇంకా రెండు మూడు సీజన్లు ఉన్నాయనిపించింది,” అని అన్నారు.Anil Kumble మాట్లాడుతూ, “అశ్విన్ రిటైర్మెంట్ మద్యలో ప్రకటించినట్లే, వీళ్లు కూడా ఊహించని విధంగా వెళ్లిపోయారు. వీళ్ల ముగ్గురికీ మైదానంలో ఘనంగా వీడ్కోలు ఇవ్వాల్సింది,” అని పేర్కొన్నారు.

ఇంగ్లండ్ సిరీస్పై ప్రభావం పడుతుందా?
కుంబ్లే అభిప్రాయం ప్రకారం, ఈ రిటైర్మెంట్లు జట్టుపై ప్రభావం చూపవచ్చని తెలిపారు. “విరాట్ కీలక ఇన్నింగ్స్ ఆడతాడని ఎదురుచూశాం. కానీ అలా రిటైర్ కావడం షాక్. రోహిత్ రిటైర్మెంట్తో ఓపెనింగ్లో ఖాళీ ఏర్పడింది,” అన్నారు.ఇంగ్లండ్ పిచ్లపై టెస్ట్లు గెలవడం అంత ఈజీ కాదు. జట్టులో అగ్రశ్రేణి అనుభవం ఉండాలి. రోహిత్, కోహ్లీలు ఆ లోటు పూడ్చగలవారు. ఇప్పుడు సెలెక్టర్లకు కొత్త ప్లానింగ్ అవసరం.విరాట్ రిటైర్మెంట్పై పేసర్ మహ్మద్ సిరాజ్ స్పందించారు. “నీ టెస్ట్ కెరీర్కు హ్యాట్సాఫ్. నీ లెగసీ నిలిచిపోతుంది,” అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.భువనేశ్వర్ కుమార్ కూడా భావోద్వేగంతో స్పందించారు. “డ్రెస్సింగ్ రూంలో నువ్వు లేకపోవడం పెద్ద లోటే. నన్ను ఎప్పుడూ మోటివేట్ చేసినందుకు థాంక్స్,” అంటూ కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపారు.
క్రికెట్కి వీడ్కోలు, కానీ గుర్తులు మిగిలేలా
టెస్ట్ క్రికెట్కు వీళ్లు గుడ్బై చెప్పినా, వాళ్ల ఆటతీరూ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. స్టేడియంలో వీడ్కోలు లేకపోయినా, అభిమానుల గుండెల్లో వీరి స్థానం శాశ్వతమే.
Read Also : IPL 2025: కోహ్లీ, రోహిత్ల పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు!