బెంగళూరులో జూన్ 4న జరిగిన చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) తొక్కిసలాట ఘటన అనంతరం, సీనియర్ ఐపీఎస్ అధికారి వికాస్ కుమార్ను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్) దృష్టిని (Monday) నాడు ఆశ్రయించారు.ఆ ప్రమాదం జరిగిన సమయంలో వికాస్ కుమార్ బెంగళూరు పశ్చిమ విభాగానికి ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) మరియు అదనపు పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ (RCB) విజయోత్సవ సభకు భద్రత ఏర్పాట్ల బాధ్యత పూర్తిగా ఆయనపై ఉండేది. అయినా, ఈ దుర్ఘటనకు బాధ్యులుగా చూపిస్తూ ఆయనను సస్పెండ్ చేయడాన్ని ఆయన అన్యాయంగా అభివర్ణిస్తున్నారు.జూన్ 4న ఆర్సీబీ టీమ్ విజయాన్ని గుర్తుగా ఏర్పాటు చేసిన సభలో తొక్కిసలాట జరిగింది. ప్రజల రద్దీ అధికంగా ఉండటంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది.
ప్రభుత్వం తక్షణ చర్యలు – విచారణ ఆదేశాలు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్నారు. ఐదుగురు సీనియర్ పోలీస్ అధికారులను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. అదే సమయంలో, బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో మేజిస్టీరియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ దర్యాప్తు 15 రోజుల్లోగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
సస్పెన్షన్పై వికాస్ కుమార్ అభ్యంతరం
ఈ కేసులో బాధ్యులను గుర్తించేందుకు ప్రాథమిక విచారణ జరిగింది. దీనిలో తక్కువ స్థాయి అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నప్పటికీ, సీనియర్ స్థాయిలో ఉన్న వికాస్ కుమార్ను సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై వేసిన ఆరోపణలు అప్రామాణికంగా ఉన్నాయని ఆయన ట్రైబ్యునల్కు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
క్యాట్ ముందు న్యాయపోరాటం
ఈ న్యాయ పోరాటం ద్వారా తాను తన పరువు, ఉద్యోగ గౌరవాన్ని కాపాడుకుంటానని వికాస్ కుమార్ నమ్మకంగా చెబుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నియమావళికి విరుద్ధమని ఆయన అభిప్రాయం. దర్యాప్తు పూర్తయ్యేలోపు ఈ రకమైన చర్య తీవ్ర అన్యాయం అని ఆయన వాదిస్తున్నారు.
Read Also : BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు నకిలీ కేవైసీ హెచ్చరిక