ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రచ్చ

Read Time:  1 min
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రచ్చ
FONT SIZE
GET APP

భారత క్రికెట్‌ జట్టుకు దూరమైన తర్వాత తన ప్రతిభను చాటేందుకు కృషి చేస్తున్న మయాంక్ అగర్వాల్ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. ఈ స్టార్ బ్యాట్స్‌మన్‌ ఇంగ్లండ్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో చోటు కోసం ప్రయత్నించినా అదృష్టం కలిసి రాలేదు. అయితే, దేశవాళీ టోర్నీల్లో అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లను ఆశ్చర్యపరుస్తున్నాడు. మయాంక్‌ అగర్వాల్‌ ప్రస్తుతం కర్ణాటక జట్టుకు నాయకత్వం వహిస్తూ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

champions trophy 2025
champions trophy 2025

కేవలం ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 613 పరుగులు చేసి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని చివరి ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు ఉండగా, వాటిలో మూడు వరుసగా వచ్చాయి. మయాంక్ ఆడిన మరో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించి సెంచరీని అతి తక్కువ తేడాతో మిస్సయ్యాడు.మయాంక్ ఈ సీజన్‌లో ఆడిన కొన్ని మెమరబుల్ ఇన్నింగ్స్: 139 నాటౌట్ 100 నాటౌట్ 124 పరుగులు 116 నాటౌట్ అతను ఏడు ఇన్నింగ్స్‌ల్లో 153.25 సగటు రన్‌రేట్‌తో పరుగులు సాధించి తన శక్తిని మరోసారి నిరూపించాడు. 111.65 స్ట్రైక్ రేట్‌తో ఆడిన అతను 66 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టాడు.

మయాంక్ 2020 నుంచి భారత్ తరపున వన్డే ఆడలేదు.కానీ ప్రస్తుతం అతని ఫామ్ అతన్ని జాతీయ జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం కల్పించగలదు. విజయ్ హజారే ట్రోఫీలో మయాంక్ ప్రదర్శన సెలెక్టర్లను కూడా ఆకట్టుకుంటోంది. అతని స్థిరత్వం, ఆత్మవిశ్వాసం ఆయన జట్టులో స్థానం కోసం తన హక్కు తానే నిరూపించుకుంటున్నట్లు చూపిస్తోంది.మయాంక్ తర్వాత ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కరుణ్ నాయర్. విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కరుణ్ 6 మ్యాచ్‌ల్లో 542 పరుగులు చేశాడు. మయాంక్‌ తపన, కరుణ్‌ ప్రతిభ జాతీయ జట్టుకు అవసరమైన కొత్త టాలెంట్‌ను చూపిస్తున్నాయి.

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.