కర్ణాటకలో విదేశీ మహిళపై దారుణం – నిందితుల కోసం గాలింపు!

టూరిస్ట్ మహిళ అత్యాచారం వేగంగా దర్యాప్తు

కర్ణాటకలోని గంగావతి ప్రాంతంలో చోటుచేసుకున్న దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో విదేశాలకు చెందిన పర్యాటకులు దుండగుల దాడికి గురికావడం, ఓ వ్యక్తి మృతిచెందడం, ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, వారు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని అధికారులు వెల్లడించారు.

Advertisements
i5gf39dg karnataka gangrape 160x120 08 March 25

ఘటన వివరాలు

గురువారం నాడు ఇజ్రాయెల్‌కు చెందిన ఓ యువతి, అమెరికాకు చెందిన ఓ యువకుడు, మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన బిబాస్ అనే వ్యక్తులు కర్ణాటకలోని గంగావతి ప్రాంతానికి పర్యటనకు వచ్చారు. వీరంతా ఆనెగుందిలోని అంబికా నాయక్ హోం స్టేలో బస చేశారు. పర్యటనలో భాగంగా రాత్రి సమయం వద్ద సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించడంతో పాటు అక్కడ ఆనందంగా గడిపారు. ఈ సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ ప్రదేశానికి చేరుకుని, ముందుగా పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందంటూ వారితో మాటలు కలిపారని అనంతరం రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. దానికి పర్యటకులు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన దుండగులు పర్యటకులపై దాడి చేసి, పంకజ్, బిబాస్, డేనియల్ను పక్కనే ఉన్న కాలువలోకి తోసేశారు. పంకజ్, డేనియల్ ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా బిబాస్ నీటి ఉద్ధృతికి గల్లంతయ్యాడు. పురుషులను కాలువలోకి తోసి మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దుండగులు అక్కడినుంచి పారిపోయారని తెలిపారు. ప్రస్తుతం బాధిత మహిళలు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 

ఈ ఘటనపై కొప్పల్ జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హోంస్టే, సంఘటన ప్రదేశం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. హోంస్టే యజమాని సహా స్థానిక ప్రజల వాంగ్మూలాలను రికార్డు చేస్తున్నారు. అత్యాచారానికి గురైన మహిళల వైద్య పరీక్షలు నిర్వహించగా, నివేదిక అధికారులకు అందినట్లు సమాచారం. సూపరింటెండెంట్ రామ్ ఎల్ అరసిద్దికి ఫిర్యాదు చేసినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి నిందితుల కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయని నిందితులను త్వరగా అరెస్టు చేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు.

Related Posts
రాడ్డు మీద పడి అథ్లెటిక్ మృతి
రాడ్డు మీద పడి అథ్లెటిక్ మృతి

రాజస్థాన్‌లోని బికనూర్ జిల్లాలో ఓ యువ అథ్లెట్‌ ప్రాణాంతక ప్రమాదానికి గురైంది. మహిళా పవర్ లిఫ్టర్ యశ్తికా ఆచార్య (17) ట్రైనింగ్ సమయంలో 270 కేజీల బరువైన Read more

ఆస్ట్రేలియాలో లైంగిక వేధింపుల కేసులో భారతీయుడికి జైలు శిక్ష
ఆస్ట్రేలియాలో లైంగిక వేధింపుల కేసులో భారతీయుడికి జైలు శిక్ష

ఆస్ట్రేలియాలో హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రతినిధి నాయకుడైన 43 ఏళ్ల బాలేష్ ధంఖర్ ఐదుగురు కొరియన్ మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడినందుకు 40 సంవత్సరాల Read more

Delhi Judge :ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బంగ్లాలో అగ్నిప్రమాదం – భారీ నగదు లభ్యం
దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బంగ్లాలో అగ్నిప్రమాదం – భారీ నగదు లభ్యం

దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో మార్చి 14న అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు జస్టిస్ వర్మ నగరంలో లేరు. కుటుంబసభ్యులే అగ్నిమాపక సిబ్బంది, Read more

డాక్టర్ హత్యాయత్నం కేసులో సంచల నిజాలు!
డాక్టర్ హత్యాయత్నం కేసులో సంచల నిజాలు!

వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన యువ డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం ఘటనలో పోలీసులు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. యువ వైద్యుడి భార్య ప్రభుత్వ లెక్చరర్. Read more

×