కాంగ్రెస్ ప్రముఖ నేత సోనియాగాంధీ (Sonia Gandhi) అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. స్వల్ప ఆరోగ్య సమస్యలతో శనివారం ఉదయం ఆమె సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ (Indira Gandhi Medical in Shimla) కాలేజీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది ఒక సాధారణ ఆరోగ్య పరీక్షల భాగంగా జరిగిందని అంటున్నారు.హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మీడియా సలహాదారు నరేష్ చౌహాన్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆమె ఆరోగ్యం ప్రశాంతంగానే ఉంది. కేవలం రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారు, అని నరేష్ మీడియాకు వెల్లడించారు. అయితే, అదనంగా కొన్ని ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించినట్టు సమాచారం.
ఎంఆర్ఐ పరీక్షలు కూడా చేసినట్లు సమాచారం
వైద్య బృందం సోనియాగాంధీకు ఎంఆర్ఐ స్కాన్ చేసినట్టు తెలిసింది. ఇవి సాధారణ జాగ్రత్తల్లో భాగంగా తీసుకున్న చర్యలేనని వైద్యులు పేర్కొంటున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ప్రత్యేక ఆందోళన అవసరం లేదని పేర్కొనడం విశేషం.78 ఏళ్ల సోనియాగాంధీ మే 27న దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పటి తరువాత ఆమె బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆమె ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో ఆందోళనకు దారి తీసింది.
ఆందోళన అవసరం లేదు, చెక్అప్ మాత్రమే
వైద్యుల ప్రకారం, ఆమెకు ఆరోగ్యపరమైన ఎటువంటి తీవ్రమైన సమస్యలు లేవు. కేవలం సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా బాగానే ఉన్నారని సమాచారం.
Read Also : Infosys : ఇన్ఫోసిస్ ఒక్కో ఇంటర్వ్యూకి రూ.700 చొప్పున చెల్లింపు