జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారన్న వీర్రాజు

Somu Veeraju : జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారన్న వీర్రాజు

Somu Veeraju : జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారన్న వీర్రాజు వైసీపీ అధినేత జగన్‌పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని జగన్ అనుకోవడం కేవలం కలగానే మిగిలిపోతుందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 శాతం ఓట్లు కూడా రాకుండా చూస్తామని చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళతానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.2014లో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా వచ్చినప్పటికీ అసెంబ్లీకి వెళ్లలేదని వీర్రాజు గుర్తు చేశారు.

Advertisements
జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారన్న వీర్రాజు
Somu Veeraju జగన్ మళ్లీ సీఎం అవుతానని కలలు కంటున్నారన్న వీర్రాజు

ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని చెప్పడం జగన్ ద్వంద్వ ధోరణిని బయటపెడుతోందని విమర్శించారు.కూటమి లక్ష్యం వైసీపీని పూర్తిగా ఖాళీ చేయడమేనని స్పష్టం చేశారు.అంతేకాదు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా సోము వీర్రాజు మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని, తన కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు భవిష్యత్తుపై గందరగోళంలో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే మాటలు చెప్పి పదేళ్ల పాటు పాలన సాగించారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Related Posts
యూఎస్‌ ఎయిడ్ నిలిపివేత.. భారత్‌ పై ఎఫెక్ట్‌
Suspension of USAID.. Effect on India

న్యూయార్క్‌: ప్రపంచ దేశాల అభివృద్ధి కోసం ఆర్థిక సాయం అందించే యూఎస్‌ ఎయిడ్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్‌ భారత్‌పై Read more

DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుపై అధికార ప్రకటన
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు – జీతాల్లో ఎంత మార్పు?

ఉగాది పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త వచ్చింది. 2025 మార్చి 28న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, కేంద్ర ఉద్యోగుల కరువు భత్యం Read more

జనసేనలో వివాదం: కిరణ్ రాయల్‌పై చర్యలు
జనసేనలో వివాదం: కిరణ్ రాయల్‌పై చర్యలు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న కిరణ్ రాయల్‌పై తీవ్ర ఆరోపణలు రావడంతో, ఆయనను పార్టీ కార్యకలాపాలకు తాత్కాలికంగా దూరంగా ఉంచాలని Read more

కొండగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి అరెస్టు
Kodangal former MLA Patnam Narender Reddy arrested

హైదరాబాద్‌: లగచర్ల ఘటన కు సంబంధించిన కేసులో కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఆయనను హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×