हिन्दी | Epaper
తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు నేడు, రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు

Shravan Rao : నాలుగవసారి సిట్ ఎదుట విచారణకు హాజరు

Digital
Shravan Rao : నాలుగవసారి సిట్ ఎదుట విచారణకు హాజరు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ప్రముఖ మీడియా అధినేత Shravan Rao మరోసారి సిట్ అధికారులు విచారించారు. ఇది నాలుగవసారి ఆయన విచారణకు హాజరవడం. బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ ఐదున్నర గంటల పాటు సాగింది. ఇప్పటికే మూడు సార్లు విచారణకు హాజరైన శ్రవణ్ రావు, ఈసారి కూడా తీవ్రంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వచ్చింది.ఈ కేసు మొదట గత ఏడాది (2024) మార్చిలో వెలుగు చూసింది. నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మొదటి నిందితుడిగా గుర్తించబడ్డారు. ఆరో నిందితుడిగా ఉన్న ,Shravan Rao కేసు వెలుగు చూడకముందే 2024 ఫిబ్రవరిలో అమెరికాకు పారిపోయారు. మిగతా నలుగురు పోలీసు అధికారులు అరెస్టయ్యి పది నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ మధ్యనే సిట్ అధికారులు ఈ ఇద్దరిని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయగా, ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడు శ్రవణ్ రావు

ఇంతలో ప్రభాకర్ రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరగా, శ్రవణ్ రావు సుప్రీం కోర్టులో మధ్యంతర ఉత్తర్వులు పొంది గత నెల 29వ తేదీన మొదటిసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదటి దఫా విచారణ ఆరున్నర గంటల పాటు సాగింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారో, ఎవరి ఆధ్వర్యంలో ఇది జరిగినదో, ఎంత డబ్బు ఖర్చయిందో వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వచ్చింది.రెండవసారి విచారణ మే 2న జరిగినప్పటికీ అది కేవలం గంటపాటే సాగింది. ఈసారి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాడిన ఫోన్లను తేవాలని సిట్ కోరగా, శ్రవణ్ రావు రెండు ఫోన్లు సమర్పించారు. వాటిలో సమాచారమేమీ లేకపోవడంతో అసలైన ఫోన్లు తెచ్చి ఇవ్వాలని సూచించగా, ఆయన అందజేశారు. ఆ ఫోన్లలోని డేటాను విశ్లేషించిన అనంతరం మూడవసారి, అంటే మే 8న శ్రవణ్ రావును 11 గంటల పాటు విచారించారు.తాజాగా బుధవారం మరోసారి ఐదున్నర గంటలపాటు విచారణ జరిపారు. ఈ దఫా సిట్ బాస్ పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్, ఎసీపీ వెంకటగిరి తదితర అధికారులు విచారణలో పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా 2023 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందన్న అంశంపై దృష్టి పెట్టారు. ఎన్ని నెలలు ట్యాపింగ్ కొనసాగింది, ఎన్ని కేంద్రాల్లో ఈ కార్యకలాపాలు జరిగినాయి, ఎన్ని మొబైల్ ట్యాపింగ్ కేంద్రాలు వాడారు, ఇందులో పాల్గొన్న వారిలో ఎవరెవరు పోలీసు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో కూడా ప్రశ్నించినట్టు సమాచారం.ఇటీవల అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల సహకారం ఉందా అనే కోణంలోనూ ప్రశ్నలు చేశారు. శ్రవణ్ రావు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మరోసారి అవసరమైతే హాజరు కావాలని సూచించడంతో, రాత్రి పది గంటల సమయంలో ఆయన పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. అయితే, మీడియాతో ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయారు

Read more : JD Vance : యూఎస్ ఉపాధ్యక్షుడి భారత పర్యటన ఖరారు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు సీపీ సజ్జనార్ వార్నింగ్

తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు సీపీ సజ్జనార్ వార్నింగ్

నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కఠిన ఆంక్షలు!

నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కఠిన ఆంక్షలు!

ఉచిత బస్సు పథకం ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తోంది

ఉచిత బస్సు పథకం ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తోంది

క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా

క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా

మూసీ నది పునరుజ్జీవం: తొలి దశ పనులు త్వరలో ప్రారంభం

మూసీ నది పునరుజ్జీవం: తొలి దశ పనులు త్వరలో ప్రారంభం

ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం

ప్యారడైజ్ నుంచి షామీర్‌పేట్ వరకు 18.5 కిమీ కారిడార్ నిర్మాణం

హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

హౌసింగ్ బోర్డు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు

తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు

ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కుట్ర

ఉపాధి హామీ పథకాన్ని చంపేందుకు కుట్ర

హ్యామ్ రోడ్లపై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు ముందడుగు

హ్యామ్ రోడ్లపై లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తేనే కాంట్రాక్టర్లు ముందడుగు

వ్యవసాయ వర్సిటీ ప్రగతి నివేదిక విడుదల

వ్యవసాయ వర్సిటీ ప్రగతి నివేదిక విడుదల

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: హాస్టళ్లను తనిఖీ చేయాలి

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: హాస్టళ్లను తనిఖీ చేయాలి

📢 For Advertisement Booking: 98481 12870