Show cause notices for ambati murali krishna

అంబటి రాంబాబు సోదరుడికి షోకాజ్ నోటీసులు

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు, పొన్నూరు వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ మురళీకృష్ణకు షాక్ ఇచ్చేందుకు కార్పొరేషన్ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గుంటూరులోని పట్టాభిపురంలో ఆయన నిర్మించిన గ్రీన్‌గ్రేస్ అపార్ట్‌మెంట్‌కు నగరపాలక, రైల్వే, అగ్నిమాపకశాఖ, పీసీబీ నుంచి పూర్తిస్థాయి అనుమతులు తీసుకోలేదన్న కారణంతో అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

Advertisements

కాగా, గుంటూరులోని పట్టాభిపురంలో అపార్ట్ మెంట్ నిర్మించారు. ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన కార్పొరేషన్.. రైల్వే.. ఫైర్.. పీసీబీల నుంచి పూర్తి స్థాయి అనుమతులు తీసుకోలేదు. అంతేకాదు.. కార్పొరేషన్ కు చెల్లించాల్సిన ఫీజు కూడా కట్టలేదు. రైల్వే శాఖ కేవలం జీప్లస్4 నిర్మాణానికి అనుమతి ఇస్తే.. నాలుగు రెట్లు ఎక్కువగా నిర్మాణాలను నిర్మించటం గమనార్హం. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు తాము ఇచ్చిన అనుమతులకు భిన్నంగా భారీ ఎత్తున నిర్మాణాన్ని చేపట్టిననేపథ్యంలో రైల్వే శాఖ ఇచ్చిన ఎన్ వోసీని రద్దు చేసింది. ఇదంతా ఏడాది క్రితమే జరిగినా.. అప్పట్లో అంబటి అధికారంలో ఉండటంతో వారిని అడ్డుకునే వారే లేకపోయారు.

అయితే దీనికి ఆయన స్పందించకపోవడంతో దానిని కూల్చడం, లేదంటే సీజ్ చేయడం, లేదంటే ప్రాసిక్యూషన్ కోసం కోర్టుకు వెళ్లడంలలో ఏదో ఒకటి చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇక, తాజాగా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఈ ఇష్యూను తెర మీదకు తీసుకురావటం.. ప్రశ్నించటంతో స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. రివైజ్డ్ ప్లాన్ తోనూ నిర్మాణదారుడు మోసంచేసిన విషయాన్ని గుర్తించిన అధికారులు అవాక్కు అయ్యారు. రైల్వే శాఖ ఇచ్చిన ఎన్ వోసీ రద్దు విషయాన్ని దాచి పెట్టేసి.. బరితెగింపునతో నిర్మాణం చేపట్టిన వైనం సంచలనంగా మారింది. దీంతో క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేశారు.

Related Posts
మౌని అమావాస్య అంటే ఏంటి..? ఈరోజు ఏంచేయాలి..?
Mauni Amavasya 2025

హిందూ సంప్రదాయంలో అమావాస్య రోజుకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అందులోనూ పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అని అంటారు. ఈ రోజు మౌనం పాటించడం ద్వారా Read more

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు
శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు

శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు:- ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దేశవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఢిల్లీ, Read more

CM Revanth Reddy : ఆదిలాబాద్ కు కూడా ఎయిర్ పోర్టు తీసుకొస్తా : సీఎం రేవంత్‌ రెడ్డి
Today they will receive compassionate employment letters.

CM Revanth Reddy : ఆదిలాబాద్ కూడా ఎయిర్ పోర్టు తెస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్ తెచ్చే బాధ్యత నాదన్నారు. బీజేపీ Read more

జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ కాదు ఫ్యామిలీ దావత్‌ – కేటీఆర్
KTRs brother in law Raj Pa

ఆదివారం ఉదయం నుండి జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ పై పెద్ద ఎత్తున ఆరోపణలు , ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. కేటీఆర్ బావమరిది Read more

Advertisements
×