Another key decision by the

రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల్లో రాష్ట్రాభిమానం పెంపొందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ను, తెలంగాణ తల్లి చిత్రాన్ని పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర భావజాలాన్ని విద్యార్థులలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

వచ్చే విద్యాసంవత్సరం నుండి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని పాఠ్యపుస్తకాల్లో ఈ కొత్త మార్పులు అమలు కానున్నాయి. ప్రస్తుత పాఠ్యపుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీటితో పాటు రాష్ట్రగీతం, తెలంగాణ తల్లి ఫొటో కూడా చేర్చడం ప్రత్యేకతగా మారనుంది.

ఈ నిర్ణయంపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ..”2025-26 విద్యాసంవత్సరానికి పాత సిలబస్ కొనసాగుతుందని, 2026-27లో కొత్త సిలబస్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది” అని తెలిపారు. కొత్త సిలబస్‌లో రాష్ట్ర చరిత్ర, సంస్కృతి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని ఆయన వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రగీతం, తెలంగాణ తల్లి ఫొటో విద్యార్థులపై సానుకూల ప్రభావం చూపుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో ఈ చర్య ఒక పెద్ద అడుగు అని చెబుతున్నారు. విద్యార్థులు రాష్ట్ర చరిత్ర, సంప్రదాయాల పట్ల మరింత అవగాహనతో ఎదుగుతారని ఆశిస్తున్నారు. ఈ కొత్త మార్పులు ప్రభుత్వ తీరును ప్రతిబింబిస్తాయని, విద్యావ్యవస్థలో తెలంగాణ ప్రత్యేకతను నిలబెట్టే దిశగా ఇది ఒక ముఖ్యమైన ప్రయత్నమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts
పెరుగుతున్న ఎండలు జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
పెరుగుతున్న ఎండలు జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత: కోస్తా, తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం జారీ అయిన Read more

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా
Judgment on Allu Arjun bail petition adjourned

హైదరాబాద్‌: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. నేడు అల్లు అర్జున్ రెగ్యూలర్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి Read more

ఫిబ్రవరి 10 లోగా కొత్త టూరిజం పాలసీని సిద్ధం చేయాలి – సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రానున్న గోదావరి, కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు Read more

ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నారా లోకేష్ నిధులు
ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నారా లోకేష్ నిధులు

నందమూరి తారకరామారావు (ఎన్.టి.ఆర్) మనవడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ లోని ఎన్.టి.ఆర్ ఘాట్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్.టి.ఆర్ యొక్క 29వ వర్ధంతి Read more