యుజ్వేంద్ర చాహల్అతని భార్య ధనశ్రీ వర్మకువిడాకులు ఖరారయ్యాయి. ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు గురువారం విడాకులను మంజూరు చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్న ఈ జంట, కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
పెళ్లి – విడాకులు
2020 డిసెంబర్ – చాహల్, ధనశ్రీ ప్రేమ వివాహం చేసుకున్నారు.2022 జూన్ – పెళ్లి జరిగిన ఏడాదిన్నర తర్వాతే వీరు విడిగా జీవించడం ప్రారంభించారు. 2024 మార్చి – విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
2025 మార్చి – కోర్టు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది.
ఉమ్మడి పిటిషన్
చాహల్, ధనశ్రీ కలిసి కుటుంబ కోర్టులో ఉమ్మడి పిటిషన్ దాఖలు చేశారు.వీరిద్దరి అంగీకారంతోనే విడాకులు మంజూరైనట్లు న్యాయవాది నితిన్ గుప్తా తెలిపారు.ఇకపై వారిద్దరూ భార్యభర్తలు కాదని, వారి మధ్య సంబంధం పూర్తిగా ముగిసిందని కోర్టు స్పష్టం చేసింది.అయితే, విడాకుల పత్రాల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
భరణం
ధనశ్రీకి భరణంగా చాహల్ రూ. 4.75 కోట్లు చెల్లించేందుకు అంగీకరించాడు.ఇప్పటికే రూ. 2.37 కోట్లు చెల్లించాడని కోర్టు ధృవీకరించింది.మిగిలిన మొత్తం కొద్ది నెలల్లో చెల్లించాల్సిన బాధ్యత చాహల్దే అని న్యాయస్థానం పేర్కొంది.

సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్
వీరిద్దరూ విడిపోవడానికి ఖచ్చితమైన కారణాలు అంతగా బయటపడలేదు.అయితే, గత కొన్ని నెలలుగా ధనశ్రీ,చాహల్ మధ్య విభేదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి.వీరి విడాకులకు మూడో వ్యక్తి కారణమా? లేదా కెరీర్ విభేదాలా? అనేది ఇప్పటికి స్పష్టత రాలేదు.గతంలో ధనశ్రీ, ష్రేయాస్ అయ్యర్ మధ్య సంబంధం ఉందన్న రూమర్లు వచ్చాయి, కానీ వాటిపై ఎటువంటి ఆధారాలు లేవు.యుజ్వేంద్ర చాహల్ ఇటీవల తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచాడు. భారత క్రికెట్ జట్టు స్టార్ లెగ్-స్పిన్నర్ అయిన చాహల్ ప్రస్తుతం తన విడాకుల కేసు కారణంగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటి అయిన ధనశ్రీ వర్మతో 2020లో వివాహం చేసుకున్న చాహల్, 2022 నుండి ఆమెతో విడివిడిగా ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.ధనశ్రీ వర్మ ఒక దంత వైద్యురాలిగా ఉండటమే కాకుండా, కొరియోగ్రాఫర్గా, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా కూడా మంచి గుర్తింపు సంపాదించారు.