हिन्दी | Epaper
రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Vaartha live news : Andhra Pradesh : ఆమెకు తరచూ తలనొప్పి..మెదడులో దాన్ని చూసి డాక్టర్లు షాక్

Divya Vani M
Vaartha live news : Andhra Pradesh : ఆమెకు తరచూ తలనొప్పి..మెదడులో దాన్ని చూసి డాక్టర్లు షాక్

వైద్యులు హెచ్చరిస్తూ చెబుతున్నారు. పరాన్న జీవులు (Parasites) ప్రాణాలకు తీవ్ర ముప్పు కలిగిస్తాయని అన్నారు. ఇవి వేడి రక్తం కలిగిన జంతువుల సజీవ కణజాలాన్ని తినేస్తూ జీవిస్తాయని తెలిపారు. శరీరంలో గాయాల ద్వారా ఇవి ప్రవేశించి, సకాలంలో చికిత్స అందకపోతే అవయవాలపై దాడి చేస్తాయని అన్నారు. అలా జరిగితే ప్రాణాలకు ప్రమాదం తప్పదని వైద్యులు వివరించారు.నేటి రోజుల్లో అనేక రకాల శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. కానీ కొన్ని చికిత్సలు మాత్రం చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయి. అలాంటి అరుదైన ఆపరేషన్‌ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు (Government hospital doctors) విజయవంతంగా నిర్వహించారు. ఒక మహిళ మెదడులో ఉన్న పరాన్న జీవిని తొలగించి ఆమె ప్రాణాలను రక్షించారు.

సరోజిని పరిస్థితి

తిరువూరుకు చెందిన 50 ఏళ్ల సరోజిని కొంతకాలంగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. నొప్పి పెరిగిపోవడంతో తరచూ అపస్మారక స్థితిలోకి వెళ్తూ, మూత్ర విసర్జన నియంత్రణ కోల్పోతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 4న ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.న్యూరో సర్జరీ విభాగాధిపతి డా. శ్యామ్‌బాబ్జీ ఆమెను పరీక్షించారు. తలపై లోతైన గాయాన్ని గమనించారు. ఆ గాయం నుంచి చీము కారుతుండటంతో పాటు, అందులో కదులుతున్న క్రిములు ఉన్నాయని గుర్తించారు. మరింత స్పష్టత కోసం స్కాన్ చేయగా, మెదడులో చీము గడ్డతో పాటు పరాన్న జీవి ఉన్నట్లు తెలిసింది.

శస్త్రచికిత్స విజయవంతం

ఆగస్టు 13న వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్సలో మెదడులో ఉన్న పరాన్న జీవిని తొలగించారు. అప్పటి నుంచి సరోజిని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని తెలిపారు.డా. శ్యామ్‌బాబ్జీ మాట్లాడుతూ.. తలపై ఉన్న పుండును స్క్వామస్ సెల్ కార్సినోమాగా గుర్తించామని తెలిపారు. సాధారణంగా ఈగల వల్ల పుడే మెగ్గాట్లు, జంతువులు లేదా మనుషుల శరీరంలో నిర్జీవ కణజాలాన్ని తింటూ పెరుగుతాయని వివరించారు. అయితే కొన్నిసార్లు ఇవి సజీవ కణజాలంపైనా దాడి చేసి ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తాయని హెచ్చరించారు.

సకాలంలో చికిత్స ప్రాణ రక్షణ

శరీర గాయాల ద్వారా ఇవి లోపలికి ప్రవేశించి, వైద్యం అందకపోతే అవయవాలపై దాడి చేస్తాయని వైద్యులు హెచ్చరించారు. ప్రాణాలను రక్షించాలంటే సమయానికి వైద్యం అత్యవసరమని తెలిపారు. సరోజిని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు.ఈ అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు వైద్యులు ప్రశంసలు అందుకున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఏవీ రావు, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఏడుకొండలరావు, డీఎంఈ రఘునందన్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటన వైద్య రంగంలో ఒక అరుదైన విజయంగా నిలిచింది. సకాలంలో చికిత్స పొందితే ఎంతటి ప్రమాదకరమైన సమస్యలనైనా అధిగమించవచ్చని మరోసారి నిరూపితమైంది.

Read Also :

https://vaartha.com/confusion-over-choice-of-interim-prime-minister-in-nepal/international/545677/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870