maha kumbamela

స‌నాత‌న ధ‌ర్మ‌ర‌క్ష‌ణ‌కు శంక‌రాచార్యుల తీర్మానాలు

ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న కుంభ‌మేళా సంద‌ర్భంగా.. దేశంలోని హిందూ ధ‌ర్మాల‌కు చెందిన ముగ్గురు శంక‌రాచార్యులు భేటీ అయ్యారు. ఆ చ‌రిత్రాత్మ‌క భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో వాళ్లు సంయుక్త ప్ర‌క‌ట‌న జారీ చేశారు. స‌నాత‌న ధ‌ర్మ‌ర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. గో వ‌ధ‌ను ఆపేయాల‌ని ధ‌ర్మాదేశం ఇచ్చారు. గోవును దేశ‌మాత‌గా ప్ర‌క‌టించాల‌ని తీర్మానించారు. దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌.. స‌నాత‌న సంప్ర‌దాయ ప‌రిర‌క్ష‌ణ‌కు చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌ను పేర్కొన్నారు. కుంభ‌మేళా స‌మ‌యంలో ప్ర‌యాగ్‌రాజ్‌ను విజిట్ చేయాల‌ని స‌నాత‌న ధ‌ర్మ ఫాలోవ‌ర్ల‌కు శంక‌రాచార్యులు పిలుపునిచ్చారు.
మూడు ప్ర‌ముఖ పీఠాల‌కు చెందిన శంక‌రాచా ర్య‌లు భేటీ కావ‌డం ఇదే మొద‌టిసారి. శృంగేరి శార‌దా పీఠంకు చెందిన విధు శేఖ‌ర భార‌తి, ద్వారకా శార‌దా పీఠానికి చెందిన స‌దానంద స‌ర‌స్వ‌తి, జ్యోతిర్ మ‌ఠానికి చెందిన అవిముక్తేశ్వ‌రానంద స‌ర‌స్వ‌తి ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

ముగ్గ‌రు శంక‌రాచార్య‌లు సంయుక్తంగా ప్ర‌క‌ట‌న రిలీజ్ చేశారు. స‌నాత‌న సంస్కృతి వృద్ధి, ర‌క్ష‌ణ‌పై 27 మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రిలీజ్ చేశారు. సంస్కృత భాష ప్రాముఖ్య‌త‌పై దృష్టి పెట్టాల‌ని శంక‌రాచార్య స‌దానంద స‌ర‌స్వ‌తి తెలిపారు. గోవును దేశ‌మాత‌గా గుర్తించాల‌ని కోరుతూ శృంగేరి పీఠాధిప‌తి విధు శేఖ‌ర భార‌తి తెలిపారు. సంస్కృత విద్య ప్ర‌మోష‌న్ కోసం కేంద్రం నిధుల్ని కేటాయించాల‌ని అవిముక్తేశ్వ‌రానంద స‌ర‌స్వ‌తి తెలిపారు. న‌దులు, కుటుంబ వ్య‌వ‌స్థ‌ సంర‌క్ష‌ణ గురించి శంక‌రాచార్యులు ప్ర‌క‌ట‌న చేశారు.

Related Posts
షేక్ హసీనా వీసాను పొడిగించిన భారత్
షేక్ హసీనా వీసాను పొడిగించిన భారత్

బంగ్లాదేశ్ నుండి పెరుగుతున్న డిమాండ్ల నేపథ్యంలో షేక్ హసీనాను అప్పగించాలని వచ్చిన అంశం పై ఈ చర్య తీసుకోబడింది. అయితే, హసీనాకు ఆశ్రయం ఇచ్చారు అన్న వాదనలను Read more

బిహార్ లో మఖానా బోర్డు.. దాని గురించి తెలుసా?
Makhana Board

బిహార్ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటు చేయబడుతుందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత మఖానా గురించి అందరి ఆసక్తి Read more

డోమినికా ప్రధానమంత్రి మోడీకి అత్యున్నత గౌరవం ఇవ్వనుంది
Shri Narendra Modi Prime Minister of India

కామన్వెల్త్ ఆఫ్ డోమినికా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన అత్యున్నత జాతీయ గౌరవాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ గౌరవం, ప్రధానమంత్రి మోడీ COVID-19 మహమ్మారి సమయంలో Read more

జార్ఖండ్‌లో రెండు కూటముల మధ్య హోరాహోరీ
Clash between two alliances in Jharkhand

రాంచీ: జేఎంఎం, ఎన్డీయే కూటముల మధ్య జార్ఖండ్‌లో హోరాహోరీ పోరు కొనసాగుతున్నది. ఇరు పక్షాల మధ్య ఆధిక్యం మారుతూవస్తున్నది. ఎర్లీ ట్రెండ్స్‌లో ఎన్డీయే కూటమి 40 స్థానాల్లో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *