हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Accident : సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి

Sudheer
Accident : సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి

సత్యసాయి జిల్లా పరిగి మండలంలోని ధనపురం క్రాస్ వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గుర్తు తెలియని వాహనం ఒక ఆటోను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతులంతా దొడగట్ట గ్రామానికి చెందిన వారు

పోలీసుల వివరాల ప్రకారం, మృతులంతా రొద్దం మండలానికి చెందిన దొడగట్ట గ్రామానికి చెందిన వారు. వారు కోటిపి చౌడేశ్వరి ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను అలివేలమ్మ, ఆదిలక్ష్మమ్మ, శాకమ్మగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఫార్మసీ విద్యార్థిని బలి తీసుకున్న ర్యాష్ డ్రైవింగ్!

ఆ గ్రామంలో తీవ్ర విషాదం

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు మృతిచెందడంతో దొడగట్ట గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామ ప్రజలు గాఢమైన విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై జిల్లా వాసులు శోకాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870