dil raju

దిల్‌రాజు ఇంట్లో ముగిసిన సోదాలు

నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో కీలక అంశాలను గుర్తించారు. వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్‌కు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. దిల్‌రాజు ఇంట్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. దిల్‌రాజు కార్యాలయంలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగు రోజుల పాటు దిల్‌ రాజు నివాసంలో సుదీర్ఘంగా తనిఖీలు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ సోదాలు ముగిసిన తర్వాత దిల్‌రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తరలించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్‌ కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. రెండేళ్లుగా నిర్మించిన చిత్రాల వ్యయం, ఆదాయాలపై ఆరా తీస్తున్నారు.

నాలుగు రోజుల పాటు జరిగిన ఐటీ సోదాల్లో కీలక అంశాలను గుర్తించారు. వచ్చిన లాభాలకు కట్టిన ట్యాక్స్‌కు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అలాగే సంక్రాంతికి వచ్చిన సినిమాల కలెక్షన్లపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. దిల్‌రాజు ఇంట్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. దిల్‌రాజు కార్యాలయంలో కూడా ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం లీగల్ ఫార్మల్టీస్‌ను ఐటీ పూర్తి చేస్తోంది. గతంలో భారీ బడ్జెట్ సినిమాలు చేసిన ఆదాయం ఎక్కువగా వచ్చిందని ప్రకటించిన నిర్మాతల ఇళ్లలోనే ఐటీ అధికారులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏకకాలంలో పెద్ద బ్యానర్స్‌ ఉన్న నిర్మాతలపై ఐటీ శాఖ దాడులు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

Related Posts
త్యాగానికి, సేవకు ప్రతీక పోలీసులు: సీఎం రేవంత్ రెడ్డి
Police are a symbol of sacrifice and service. CM Revanth Reddy

హైదరాబాద్‌: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా గోషామహల్ పోలీస్ Read more

కేటీఆర్‌కు మళ్లీ ఏసీబీ నోటీసులు..!
ACB notices to KTR once again..!

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశముంది. కేటీఆర్ ఇచ్చిన సమాధానంపై ఏసీబీ అధికారులు లీగల్ Read more

ఏడుపాయల అతిథి గృహంలో దాడి – 11 మంది జూదరుల అరెస్ట్
11 gamblers arrested in att

మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లి శివారు ఏడుపాయలకు వెళ్లే దారిలో ఉన్న ఒక భవనంలో శనివారం రాత్రి పోలీసులు దాడి చేసి 11మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ Read more

నేడు కొడంగల్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌ రెడ్డి
cm revanth orders halting of tenders for rayadurgam shamshabad metro jpg

హైదరాబాద్‌: ప్రభుత్వ అధికారిక కార్యాక్రమాల్లో భాగంగా ఈరోజు సీఎం రేవంత్‌రెడ్డి తొలిసారి కొడంగల్ నియెజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన Read more