हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Election Commission : ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

sumalatha chinthakayala
Election Commission : ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

Election Commission : ఏపీలో మరోసారి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రానికి సంబంధించి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానం ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడింది. ఈ మేరకు ఆ రాజ్యసభ స్థానానికి సంబంధించి ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీలన చేపట్టి.. మే 2 వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. మే 9న ఎన్నిక నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. విజయసాయిరెడ్డికి 2028 జూన్‌ వరకు పదవీకాలం ఉండగానే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మరి ఈ రాజ్యసభ స్థానం ఎవరికి దక్కుతుందనే చర్చ మొదలైంది.

ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు

టీడీపీకి రెండు, బీజేపీకి ఒక స్థానం

గతేడాది వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. ఈ మూడు స్థానాలు కూటమి దక్కించుకుంది. టీడీపీకి రెండు, బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్‌లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం దక్కింది. అయితే ఈ ఏడాది జనవరిలో విజయసాయరెడ్డి తన రాజ్యసభ ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానన్నారు. అయితే ఆయన రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ స్థానానికి సంబంధించిన ఎన్నిక కోసం ఇప్పుడు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ రాజ్యసభ పదవి కూటమికి దక్కనుండటంతో.. మూడు పార్టీలలో ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.

మద్యం కుంభకోణంలో సిట్ నోటీసులు జారీ

మరోవైపు విజయసాయిరెడ్డికి గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లి సిట్‌ టీమే.. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు విజయవాడ సిటీ పోలీసు కమిషనరేట్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే విజయసాయిరెడ్డి ఈ నెల 17వ తేదీనే విచారణకు వస్తానని చెప్పారట.. అందుకు తగిన విధంగా సిట్‌ ఏర్పాట్లు చేసుకుంటోందట. ఈ మద్యం కుంభకోణంలో బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్‌ 179 ప్రకారం సాక్షిగా ఆయనను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. గతంలో కూడా విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో కర్త, కర్మ, క్రియ రాజ్‌ కసిరెడ్డేనని అన్నారు.

Read Also: నేడు విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

తిరుమల భక్తులకు శుభవార్త.. త్వరలోనే ఏఐ చాట్‌బాట్ సేవలు

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

కర్నూలులో బంగారు గనుల తవ్వకాలు ప్రారంభం

📢 For Advertisement Booking: 98481 12870