ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి (Attack on Delhi Chief Minister Rekha Gupta) జరిగిన 24 గంటల్లోనే కేంద్రం కీలకంగా స్పందించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల సున్నితంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్ విభాగానికి కొత్త అధిపతిని నియమించింది.జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సతీశ్ గోల్చా (IPS officer Satish Golcha) ను ఢిల్లీ నూతన పోలీస్ కమిషనర్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.సతీశ్ గోల్చా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనకి లాంగ్ సర్వీస్ అనుభవం ఉంది. ఇప్పటి వరకు ఆయన జైళ్ల శాఖలో డైరెక్టర్ జనరల్గా విజయవంతంగా పనిచేశారు.గతంలో ఆగస్టు 1న ఎస్బీకే సింగ్ తాత్కాలిక పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆ స్థానాన్ని సతీశ్ గోల్చా భర్తీ చేస్తున్నారు. ఆయన నియామకానికి సంబంధించి ఉత్తర్వులు ఆగస్టు 21న వెలువడ్డాయి.
బాధ్యతలు తీసుకునే దాకా కొనసాగిస్తారు
సమర్థ అధికారి గుర్తింపుతో సతీశ్ గోల్చాను కమిషనర్గా నియమించాం. ఆయన తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగుతారు అని కేంద్ర హోంశాఖ పేర్కొంది.బుధవారం జరిగిన దాడికి కేవలం 24 గంటల వ్యవధిలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది భద్రతపై కేంద్రం సీరియస్గా ఉందని సూచిస్తుంది.సివిల్ లైన్స్లోని తన అధికారిక నివాసంలో సీఎం రేఖా గుప్తా ప్రజా వినతుల స్వీకరణలో పాల్గొంటున్న సమయంలో ఆ దాడి జరిగింది. ఈ ఘటనతో ఢిల్లీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేగింది.ఈ ఘటన తర్వాత భద్రతా వ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పోలీస్ శాఖ తీరుపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే కేంద్రం గోల్చాను కమిషనర్గా నియమిస్తూ వేగంగా స్పందించింది.
ఢిల్లీకి అనుభవం ఉన్న అధికారి అవసరం
రెగ్యులర్ అధికారిగా అనుభవం గల వ్యక్తిని కమిషనర్గా నియమించడమే, శాంతి భద్రతలను పటిష్టం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం చేసిన స్ట్రాటజిక్ డెసిషన్ అన్నమాట.ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడికి సంబంధించి విచారణ కొనసాగుతోంది. కొత్త పోలీస్ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిపై మరింత దృష్టి పెట్టే అవకాశముంది.
Read Also :