Sankranti holidays in Telangana from tomorrow

రేపటి నుంచి సంక్రాంతి సెలవులు..

హైద‌రాబాద్ : తెలంగాణలో సంక్రాంతి పండుగ హ‌డావుడి మొద‌లైంది. ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో ఇవాళ ఘ‌నంగా సంక్రాంతి వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఎందుకంటే రేప‌ట్నుంచి స్కూళ్ల‌కు సంక్రాంతి సెల‌వులు కాబ‌ట్టి. స్కూల్ విద్యార్థులు సంప్ర‌దాయ దుస్తుల్లో ముస్తాబై పాఠ‌శాల‌ల‌కు వెళ్లారు. రాష్ట్రంలోని అన్ని ర‌కాల పాఠ‌శాల‌ల‌కు జ‌న‌వ‌రి 11 నుంచి 17 వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించారు. 18వ తేదీన పాఠ‌శాల‌లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇక జూనియ‌ర్ కాలేజీల‌కు జ‌న‌వ‌రి 11 నుంచి 16 వ‌ర‌కు సెలవులు ప్ర‌క‌టించారు. 17న పునఃప్రారంభం కానున్నాయి.

సెల‌వు దినాల్లో ఎట్టి ప‌రిస్థితుల్లో కూడా త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ప్ర‌యివేటు కాలేజీల యాజ‌మాన్యాల‌ను హెచ్చ‌రించింది. ఇంట‌ర్ బోర్డు నిబంధ‌న‌లు ఉల్లంఘించిన కాలేజీల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఇకపోతే.. స్కూళ్ల‌కు సంక్రాంతి సెల‌వుల నేపథ్యంలో హైదరాబాద్​, బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఇప్పటికే పండగ రద్దీ దృష్ట్యా 7,200 అదనపు బస్సులు నడపాలని ఏపీఎస్​ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి మొదలైన బస్సులు ఈ నెల 13వ తేదీ వరకు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి పలుచోట్లకు 2,153 బస్సులను ఆర్టీసీ నడపనుంది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 114 అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు బస్సులను అధికారులు సిద్ధం చేశారు. బెంగళూరు నుంచి పలుచోట్లకు 375 బస్సులను తిప్పనున్నారు. విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు. తిరుగు ప్రయాణాలకు ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ ఎండీ తెలిపారు. సాధారణ బస్సు ఛార్జీలే ప్రత్యేక బస్సుల్లో ఉంటాయన్నారు.

Related Posts
కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎంపిక
భారత్-కెనడా సంబంధాల్లో మార్పు? – మార్క్ కార్నీ

కెనడా నూతన ప్రధాన మంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. లిబరల్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్టు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించిన Read more

ఏపీలో వాలంటీర్లు వద్దే వద్దు – నిరుద్యోగ జేఏసీ
ap volunteer

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థపై నిరుద్యోగ జేఏసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లను ఉపయోగించి Read more

త్వరలో భారత్‌-చైనా రక్షణ మంత్రుల భేటి..!
Defense Ministers of India and China will meet soon

న్యూఢిల్లీ: త్వరలో భారత్‌-చైనా రక్షణ మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, డోంగ్‌ జున్‌ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ మేరకు వారి మధ్య సరిహద్దు, ప్రాంతీయ స్థిరత్వమే అజెండాగా Read more

నాగ ఫణి శర్మకు పద్మశ్రీ పురస్కారం.. చంద్రబాబు
నాగ ఫణి శర్మకు పద్మశ్రీ పురస్కారం.. చంద్రబాబు

ప్రముఖ అవధాని సరస్వతీ ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ గారు 'పద్మశ్రీ' అవార్డు అందుకున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *