Saleshwaram Jatara: సలేశ్వరం జాతరకు భక్తుల సందడి..6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్

Saleshwaram Jatara: సలేశ్వరం జాతరకు భక్తుల సందడి..6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సలేశ్వరం జాతరకు ఈసారి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి సందర్భంగా జరిపే ఈ జాతర, నల్లమల అటవీ ప్రాంతంలోని లోయలలో ఉన్న లింగమయ్య స్వామి దర్శనానికి భక్తులను ఆకర్షిస్తుంది.

Advertisements

తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం

ఈ యాత్రకు తెలంగాణ అమర్‌నాథ్ యాత్ర అనే పేరుంది. గుహలో వెలసిన లింగమయ్య స్వామి దర్శనం కోసం సాహసోపేతమైన అడవి మార్గాన్ని భక్తులు అధిగమించాలి. ఇది భక్తులకు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాక, సాహస ప్రయాణం కూడా. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న దట్టమైన అడవులు, కొండలు, కోనలు, జలపాతాలు భక్తులకు ఒక రమణీయ దృశ్యంను అందిస్తాయి. నల్లమల అటవీప్రాంతం తాలూకు ప్రకృతి సౌందర్యం భక్తులకు విశేష అనుభూతిని కలిగిస్తుంది.

శ్రీశైలం ఘాట్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్

జాతరకు వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. మన్ననూర్ చెక్‌పోస్టు నుంచి సిద్ధాపూర్ వరకు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరుస సెలవులు, పండుగ దినాల కారణంగా లక్షల సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చారు. భక్తుల రాకతో అటవీశాఖ టోల్ వసూలు కేంద్రం వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఒకే మార్గంగా వెళ్లే వాహనాల సంఖ్య పెరగడంతో, టోల్ చెల్లించే ప్రక్రియ ఆలస్యం కావడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఇక్కడ వాలంటీర్లు, అటవీ శాఖ సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ జాతర మూడు రోజుల పాటు జరగడం, చివరి రోజు ఆదివారంగా ఉండటంతో భక్తుల సంఖ్య అత్యధికంగా ఉంది. ఆదివారంతో జాతర ముగియనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రెండు రోజులు కూడా ట్రాఫిక్, భద్రత సమస్యలు కొనసాగే అవకాశముంది. ఏటా చైత్రపౌర్ణమి సందర్భంగా మూడు రోజులపాటు సలేశ్వరం జాతర నిర్వహిస్తుంటారు. ఈ నేల 11న ప్రారంభమైన జాతర ఆదివారంతో ముగినుంచిది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తున్నారు. చుట్టూ అడవి.. కొండలు,కోనలు, జలపాతాలు ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు. ఈ జాతరను సాహసోపేత తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలుస్తారు.

Related Posts
చంద్రబాబు హామీలు నిలబెట్టారు, రేవంత్ నెరవేర్చలేకపోయారు: హరీష్ రావు
చంద్రబాబు హామీలు నిలబెట్టారు, రేవంత్ నెరవేర్చలేకపోయారు: హరీష్ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రేషన్ కార్డు దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సిద్దిపేటలోని Read more

నాంపల్లి కోర్టుకు హాజరైన ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి
AICC in charge Deepadas Munshi attended the Nampally court

హైదరాబాద్‌: నేడు నాంపల్లి క్రిమినల్‌ కోర్టుకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షి హాజరయ్యారు. బీజేపీ నేత ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె పరువునష్టం కేసు వేశారు. Read more

పైసా పనిలేదు.. రూపాయి లాభం లేదు: రేవంత్‌ ఢిల్లీ టూర్లపై కేటీఆర్‌ సెటైర్లు
ACB notices to KTR once again..!

హైదరాబాద్: సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు సంధించారు. పది నెలల్లో 25 సార్లు, 50 రోజులు ఢిల్లీకి పోయివస్తివి Read more

Weather Report : తెలంగాణ లో రానున్న రెండ్రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే?
Rains 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు AP

తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మార్చబడుతున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన ప్రకారం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజులు మిశ్రమ వాతావరణం ఉండబోతోంది. పగటిపూట Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×