saif ali khan

సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల స్వాధీనానికి ఉత్తర్వు!

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తన పూర్వీకులకు చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తులపై మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు తాజాగా కేంద్రం కూడా షాకిచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులకు కొనసాగింపుగా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సైఫ్ అలీ ఖాన్ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా శత్రువుల ఆస్తుల స్వాధీన చట్టం ప్రకారం మధ్యప్రదేశ్ లో పటౌడీ కుటుంబానికి చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తిని కేంద్రం స్వాధీనం చేసుకోవడంపై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తేసింది. అప్పట్లో సైఫ్ నానమ్మను ఆయన ముత్తాత అయిన హమీదుల్లా ఖాన్ కు చట్టబద్దమైన వారసురాలిగా గుర్తించింది. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ తీర్పును సమీక్షించి పాకిస్తాన్ కు వెళ్లిపోయిన ఆమె అక్క ఆబిదా సుల్తాన్ ను మాత్రమే వారసురాలిగా తేల్చింది. దీంతో సైఫ్ కుటుంబానికి దక్కాల్సిన హమీదుల్లా ఖాన్ కు చెందిన రూ.15 వేల కోట్ల ఆస్తులు ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి వెళ్లే పరిస్ధితి నెలకొంది.

2017లో ఈ చట్టాన్ని సవరించి వారి వారసులు కోర్టులో దీనిపై నెల రోజుల్లోగా అప్పీలు చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఇప్పుడు సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులపై అప్పిలేట్ అథారిటీలో సవాల్ చేసినట్లు తెలుస్తోంది. ఆలోపే మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కేంద్ర హోంశాఖ వీటిని శరణార్దుల ఆస్తులుగా గుర్తించింది. అంటే స్వాధీనానికి లైన్ క్లియర్ చేసింది. పెద్ద కుమార్తె అబిదా సుల్తాన్ 1950లో పాకిస్థాన్‌కు వలస వెళ్లిపోయారు. అయితే పాకిస్తాన్ వెళ్లిపోయిన ఆబిదా సుల్తాన్ చట్టబద్ధమైన వారసురాలు అని ఆమె దేశం విడిచి శత్రుదేశానికి వెళ్లిపోయింది కాబట్టి ఆమె ఆస్తుల్ని శత్రువుల ఆస్తుల స్వాధీన చట్టం ప్రకారం కేంద్రం స్వాధీనం చేసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వు ఇచ్చింది.

Related Posts
మరోసారి యూపీఎస్సీ సివిల్స్‌కు దరఖాస్తుల గడువు పొడిగింపు
మరోసారి యూపీఎస్సీ సివిల్స్‌కు దరఖాస్తుల గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: మరోసారి యూపీఎస్సీ సివిల్స్‌కు దరఖాస్తుల గడువు పొడిగింపు.సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ(UPSC) మరోసారి పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979 పోస్టుల Read more

మణిపూర్ సీఎంని తొలగించండి : ప్రధానికి బీజేపీ ఎమ్మెల్యేలు లేఖ
Remove Manipur CM. BJP MLAs letter to Prime Minister

ఇంఫాల్ : మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా.. ఈ నేపథ్యంలో అధికార బీజేపీలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బీరెన్ Read more

రాహుల్‌గాంధీపై విచారణ
rahul

పార్లమెంటు ఆవరణలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య చోటుచేసుకున్న బాహాబాహీ ఘటనకు సంబంధించి.. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ప్రశ్నించనున్నట్లుగా ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఎంపీల మధ్య Read more

రాహుల్ గాంధీపై పాల వ్యాపారి కేసు
rahul gandhi

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై తాజాగా బిహార్‌కు చెందిన ఓ పాల వ్యాపారి కేసు పెట్టారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యల వల్ల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *