Rythu Bharosa in the accounts of 4.41 lakh farmers.

4.41 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా..!

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం రూ.569 కోట్ల రైతు భరోసా విడుదల చేసింది. మొత్తం 32 జిల్లాల్లో 563 గ్రామాలలో 4,41,911 మంది రైతులకు ఎకరానికి రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. 26వ తేదీన బ్యాంకులకు సెలవు దినం కావటంతో 27వ తేదీ ఉదయం నుంచి ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఒక్క రోజులోనే మొత్తం రూ.569 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మొదటి రోజునే 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసాను చెల్లించింది.

తొలి రోజున దాదాపు 18180 వేల వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజునే ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి విడతగా రూ.6 వేలు చెల్లించింది.

image

జిల్లాల వారిగా విడుదలైన రైతుభరోసా నిధుల..

ఆదిలాబాద్ జిల్లా: 17 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 6,411 మంది రైతులకు రూ.14.49 కోట్లు..
భద్రాద్రి కొత్తగూడం జిల్లా: 23 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 22,242 మంది రైతులకు రూ.39.07 కోట్లు..
హన్మకొండ జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,545 మంది రైతులకు రూ.14.30 కోట్లు..
జగిత్యాల జిల్లా: 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 22,242 మంది రైతులకు రూ.39.07 కోట్లు..
జనగామ జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 12,320 మంది రైతులకు రూ.15.91 కోట్లు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 7,073 మంది రైతులకు రూ.8.67 కోట్లు..
జోగులాంబ గద్వాల జిల్లా: 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 7,829 మంది రైతులకు రూ.12.47 కోట్లు..
కామారెడ్డి జిల్లా: 22 మండలాల్లోని 24 గ్రామాలకు చెందిన 9,062 మంది రైతులకు రూ.8.35 కోట్లు..
కరీంనగర్ జిల్లా: 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 14,226 మంది రైతులకు రూ.15.96 కోట్లు..
ఖమ్మం జిల్లా: 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 20,802 రైతులకు రూ.28.42 కోట్లు..
కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: 15 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 4,344 మంది రైతులకు రూ.8.62 కోట్లు..
మహబూబాబాద్ జిల్లా: 18 మండలాల్లోని 19 గ్రామాలకు చెందిన 14,611 మంది రైతులకు రూ.18.14 కోట్లు..
మహబూబ్ నగర్ జిల్లా: 16 మండలాల్లోని 16 గ్రామాలకు చెందిన 14,575 మంది రైతులకు రూ.17.27 కోట్లు..
మంచిర్యాల జిల్లా: 16 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 7,143 మంది రైతులకు రూ.8.72 కోట్లు..
మెదక్ జిల్లా: 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 14,833 మంది రైతులకు 14.06 కోట్లు..
మేడ్చల్ జిల్లా: 5 మండలాల్లోని 5 గ్రామాలకు చెందిన 2,706 మంది రైతులకు రూ.3.14 కోట్లు..
ములుగు జిల్లా: 9 మండలాల్లోని 9 గ్రామాలకు చెందిన 6,678 రైతులకు రూ.8.26 కోట్లు..
నాగర్ కర్నూల్ జిల్లా: 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 16,806 మంది రైతులకు రూ.23.05 కోట్లు..
నల్లగొండ జిల్లా: 31 మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన 35,568 మంది రైతులకు రూ.46.93 కోట్లు..
నారాయణపేట జిల్లా: 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,348 మంది రైతులకు రూ.13.87 కోట్లు..
నిర్మల్ జిల్లా: 18 మండలాల్లోని 18 గ్రామాలకు చెందిన 7,912 మంది రైతులకు రూ.10.56 కోట్లు..
నిజామాబాద్ జిల్లా: 31 మండలాల్లోని 31 గ్రామాలకు చెందిన 35,568 మంది రైతులకు రూ.46.93 కోట్లు..
పెద్దపల్లి జిల్లా: 13 మండలాల్లోని 13 గ్రామాలకు చెందిన 9,885 మంది రైతులకు రూ.10.14 కోట్లు..
రాజన్న సిరిసిల్ల జిల్లా: 12 మండలాల్లోని 12 గ్రామాలకు చెందిన 9,724 మంది రైతులకు రూ.12.26 కోట్లు..
రంగారెడ్డి జిల్లా: 21 మండలాల్లోని 21 గ్రామాలకు చెందిన 15,597 మంది రైతులకు రూ.20.32 కోట్లు..
సంగారెడ్డి జిల్లా: 25 మండలాల్లోని 25 గ్రామాలకు చెందిన 19,933 మంది రైతులకు రూ.24.15 కోట్లు..
సిద్దిపేట జిల్లా: 26 మండలాల్లోని 26 గ్రామాలకు చెందిన 31,170 మంది రైతులకు రూ.36.76 కోట్లు
సూర్యాపేట జిల్లా: 23 మండలాల్లోని 23 గ్రామాలకు చెందిన 29,352 మంది రైతులకు రూ.37.84 కోట్లు..
వికారాబాద్ జిల్లా: 20 మండలాల్లోని 20 గ్రామాలకు చెందిన 8,609 మంది రైతులకు రూ.11.18 కోట్లు..
వనపర్తి జిల్లా: 15 మండలాల్లోని 15 గ్రామాలకు చెందిన 9,441 మంది రైతులకు రూ.12.25 కోట్లు..
వరంగల్ జిల్లా: 11 మండలాల్లోని 11 గ్రామాలకు చెందిన 11,386 మంది రైతులకు రూ.12.86 కోట్లు..
యాదాద్రి భువనగిరి జిల్లా: 17 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 17,576 మంది రైతులకు రూ.26.95 కోట్లు..

Related Posts
రజనీకాంత్ జైలర్ 2 టీజర్ విడుదల
రజనీకాంత్ జైలర్ 2 టీజర్ విడుదల

జైలర్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన తరువాత, మేకర్స్ ఇప్పుడు దాని సీక్వెల్ను ప్రకటించారు. మకర సంక్రాంతి సందర్భంగా, రజనీకాంత్ నటించిన జైలర్ 2 మేకర్స్ Read more

రెడ్‌మీ నోట్‌ 14 5G సిరీస్‌లో ₹1000 కోట్ల మైలురాయి సంబరాలు
Redmi Note 14 5G series celebrates ₹1000 crore milestone

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్‌ X Alot బ్రాండ్‌ షౌమీ ఇండియా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ సెగ్మెంట్‌లో ఆవిష్కరణలను పునర్‌నిర్వచిస్తూ అంతర్జాతీయంగా సరికొత్త ఫోన్‌ రెడ్‌మీ 14C Read more

ఏపీ డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు
Raghu Rama Raju as AP Deput

ఏపీ కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ను నియమించింది. మంగళవారం జరిగిన ఎన్డీఏ లేజిస్లేటివ్ Read more

ప్రధానమంత్రి మోదీ నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనతో కొత్త వ్యాపార అవకాశాలు
Modi Ji

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాలను పర్యటించడానికి బయలుదేరారు. ఈ పర్యటనలో, భారతదేశం ఈ మూడు దేశాలతో ఆర్థిక, వాణిజ్య సంబంధాలను Read more