Russian President to visit India soon!

Putin: త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు!

Putin: భారత్‌ పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని మోడీ చేసిన ఆహ్వానాన్ని తమ దేశాధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ అంగీకరించినట్లు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ వెల్లడించారు. “రష్యా అండ్‌ ఇండియా” టువర్డ్‌ ఏ బైలాటరల్‌ అజెండా పేరుతో రష్యన్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ కౌన్సిల్‌ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో లావ్రోవ్‌ మాట్లాడుతూ.. ఈ పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. అయితే, పర్యటన తేదీలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోడీ తొలి అంతర్జాతీయ పర్యటన రష్యాలో చేసిన విషయాన్ని లావ్రోవ్‌ గుర్తుచేశారు. ఇప్పుడు తమవంతు వచ్చిందన్నారు.

త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా

భారత్‌కు రావాలని పుతిన్‌ను మోడీ ఆహ్వానించారు.

కాగా, గతేడాది జులైలో ప్రధాని మోడీ రష్యాలో పర్యటించారు. ఐదేళ్ల వ్యవధి తర్వాత అక్కడ పర్యటించడం అదే తొలిసారి. అంతకుముందు 2019లో రష్యాలోని వ్లాదివోస్టోక్‌ నగరంలో నిర్వహించిన ఆర్థిక సదస్సులో మోడీ పాల్గొన్న సంగతి తెలిసింది. ఇటీవల రష్యా పర్యటన సందర్భంగా భారత్‌కు రావాలని పుతిన్‌ను మోడీ ఆహ్వానించారు. అమెరికా నుంచి టారిఫ్‌ల ముప్పు, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం ముగింపునకు సంప్రదింపులు జరుగుతోన్న సమయంలో పుతిన్‌ భారత్‌లో పర్యటించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

పుతిన్‌ గతంలో చాలాసార్లు భారత పర్యటనకు వచ్చారు

ఇకపోతే..భారత్‌-రష్యా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉక్రెయిన్‌ యుద్ధం సైతం దీనిపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పైగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య చర్చలు, శాంతి ఒప్పందం ద్వారానే యుద్ధం ముగుస్తుందని భారత్‌ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. పుతిన్‌ గతంలో చాలాసార్లు భారత పర్యటనకు వచ్చారు. 2000 సంవత్సరంలో అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ఆయన భారత భూభాగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు సదస్సులు, ద్వైపాక్షి ఒప్పందాల కోసం 2004, 2010, 2012, 2014, 2018, 2021లో పర్యటించారు.

Related Posts
Indian Parliament : ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు
Indian Parliament ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు

Indian Parliament : ఎంపీల జీతం రూ.1 లక్ష నుంచి లక్షలకు పెంపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల వేతనాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.తాజాగా ఎంపీల Read more

పవన్ కళ్యాణ్ ను కలిసిన తమిళ నటుడు
parthiban met pawan kalyan

తమిళ సినీ నటుడు పార్థిబన్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ మంగళగిరిలోని జనసేన పార్టీ Read more

వైజాగ్ విజ్ఞాన్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
Raging

విశాఖపట్నంలో మరోసారి ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో సీనియర్ల హింసాత్మక ప్రవర్తన మరోసారి కలకలం రేపింది. సీనియర్లు జూనియర్లపై దాడికి పాల్పడటంతో Read more

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పోరాటం- మంత్రి ఉత్తమ్
Minister Uttam Kumar warning to party MLAs and MLCs

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పోరాటం- మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *