Running a government is not about distributing money. KTR

ప్రభుత్వాన్ని నడపడమంటే పైసలు పంచడం కాదు : కేటీఆర్

హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో జరిగిన అక్రమాలు, జరగని పనులు గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా అంటూ సంచలన ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్‌లో “ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ.. హామీల అమలుకు, గారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయిన వారికి పెన్షన్లకు పైసలు లెవా అని ప్రశ్నించారు. అసమర్థుడి పాలనలో.. ఆర్థిక రంగం అల్లకల్లోలంగా మారిందని.. ప్రభుత్వాన్ని నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారంమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదు.. రాష్ట్ర సంపద పెంచడమని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Advertisements
ప్రభుత్వాన్ని నడపడమంటే పైసలు పంచడం

చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని

పేమెంట్ కోటాలో పదవి దక్కడం తో కళ్లు నెత్తికెక్కాయని, పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థిక రంగాన్ని చిందరవందర చేశావని, తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. అలాగే ఒకటో నెల ఉద్యోగులకు జీతాలిస్తానని మభ్యపెట్టి.. ఆశా, అంగన్ వాడీలకు ఒక్కో నెల జీతాలు ఆపుతున్నా అని నిస్సిగ్గుగా ప్రకటిస్తారా అని సీఎంను కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలకు గ్యారెంటీలే కాదు.. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు సీఎం, వారి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఉద్యోగులు సహకరించడం లేదనడం వారిని దారుణంగా అవమానించడమేనని. ఈ వ్యాఖ్యలు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని కేటీఆర్ అన్నారు. పరిపాలన రాక పెంట కుప్ప చేసి.. ఉద్యోగాలు పనిచేస్తలేరని నిందిస్తే సహించమని ఈ సందర్భంగా సీఎంకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

Related Posts
భవిష్యత్తులో 3.5 రోజుల పని వారాలు: AI ద్వారా పని సమయం తగ్గుతుందా?
ai

జేపీమోర్గాన్ సీఈఓ జేమీ డైమన్, భవిష్యత్ తరగతుల కోసం వారానికి 3.5 రోజుల పని వారాలను అంచనా వేస్తున్నారు. ఆయన అనుసరించిన అభిప్రాయం ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Read more

బడ్జెట్ 2025: ఆదాయపు పన్ను మినహాయింపు ఎప్పుడు?
బడ్జెట్ 2025: ఆదాయపు పన్ను మినహాయింపు ఎప్పుడు?

గత కేంద్ర బడ్జెట్‌లో పాత పన్ను విధానంలో మార్పులు చేయకుండా, కొత్త పన్ను విధానంలో కొన్ని ఆకర్షణీయమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఆదాయపు పన్ను మినహాయింపులు పొందడానికి జీతాలు Read more

హైదరాబాద్​లో పెరుగుతున్న ఫుడ్​ పాయిజనింగ్ కేసులు
Food poisoning

హైదరాబాద్ మహానగరంలో చాలామంది ఇంట్లో తినడం మానేశారు. బిజీ లైఫ్ కు అలవాటు పడిపోయి..వంట చేసుకొని తినే బదులు , వంద పెట్టి బయట తింటే సరిపోతుందికదా Read more

మద్యం మాఫియాపై చంద్రబాబు విమర్శలు
మద్యం మాఫియాపై చంద్రబాబు విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ విజయాన్ని ఆయన చారిత్రాత్మకంగా పేర్కొంటూ, ప్రధాన Read more

×