బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల’ఎక్స్’ వేదికగా ఓ కీలకమైన ప్రశ్నను నిలిపారు.ఆయన అన్నారు,”సినీ నటుడు అల్లు అర్జున్కు ఒక న్యాయం,కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మరో న్యాయమా?”సంధ్య థియేటర్ ఘటనతో, హుస్సేన్ సాగర్ ఘటనకు సంబంధించిన ప్రభుత్వ స్పందనలో తేడా ఎందుకు? అంటూ ప్రశ్నించారు.ప్రవీణ్ కుమార్ ఆగ్రహంతో మాట్లాడుతూ,హుస్సేన్ సాగర్లో ప్రాణాలు కోల్పోయిన గణపతి,అజయ్ జీవితాల విలువ, సంధ్య థియేటర్ ఘటనలోని రేవతి ప్రాణాల విలువ ఒక్కటే కావాలని చెప్పారు.
ప్రభుత్వం రెండు ఘటనలకు భిన్నంగా స్పందించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.ఆ తరువాత ఆయన రేవంత్ రెడ్డి గారిని, “మీకు, బీజేపీ నేత కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మధ్య సంబంధం ఏమిటి?” అని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ కేసులో ఓ మహిళ చనిపోయిందనే కారణంగా అల్లు అర్జున్ని జైలుకు పంపించారు,అయితే భారతమాత మహా హారతి ఘటనలో రెండు ప్రాణాలు కోల్పోయినా, కిషన్ రెడ్డి మీద కేసు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.ప్రవీణ్ కుమార్, “భారతమాత మహా హారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డీ, హుస్సేన్ సాగర్ ఘటనకు బాధ్యులా?”అని నిలదీశారు.ఆయన మాట్లాడుతూ, “కిషన్ రెడ్డి గారి స్ఫూర్తితో నడుస్తున్న ‘భారతమాత ఫౌండేషన్’ఈ కార్యక్రమానికి పోలీస్ పర్మిషన్ తీసుకోకపోతే, చెరువులో టపాకాయలు కాలుస్తామని చెప్పడం తప్పా?” అని ప్రశ్నించారు.ఇతర సమస్యలను కూడా గమనించారు.
“ఇప్పటివరకు ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయలేదు. హుస్సేన్ సాగర్లో బాంబులు పేల్చడానికి అనుమతి ఎవరు ఇచ్చారు? ఆ అధికారులపై ఎలాంటి చర్య తీసుకున్నారు?” అని ఆయన నిలదీశారు. తరువాత,”టూరిజం అధికారుల అనుమతి,అగ్నిమాపక శాఖ అనుమతి ఉన్నాయా?” అని ప్రశ్నించారు. “ఈ ఘోర ఘటనపై ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు? హోంమంత్రి మీరే కదా? అగ్నిమాపక శాఖ కూడా మీ వద్దే కదా?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.ఇలా ప్రవీణ్ కుమార్ అనేక కీలక ప్రశ్నలు వేసి, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసారు.