Minister Narayana: శాసనమండలిలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ..రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.31,600 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. ఖర్చు పెట్టే నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సహా వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటున్నట్టు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు కలిపి రూ.15వేల కోట్లు ఇస్తున్నాయని, హడ్కో నుంచి రూ.15వేల కోట్లు ఇస్తున్నాయని, హడ్కో నుంచి రూ.15వేల కోట్లు, జర్మన్కు చెందిన బ్యాంకు కేఎఫ్ డబ్ల్యూ ద్వారా రూ.5వేల కోట్లు రుణం తీసుకుంటున్నట్టు తెలిపారు.

ఖర్చు పెట్టిన నిధులు జమ చేస్తాం
అమరావతికి రైల్వే ట్రాక్ను కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేస్తుందని, ట్రాక్ ఏర్పాటుకు భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అమరావతి సెల్ఫ్ అసిస్టెంట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రజలు చెల్లించిన పన్నుల్లో పైసా కూడా అమరావతికి ఖర్చు చేయొద్దని సీఎం ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి రూ.6వేల కోట్లు కేటాయించారని విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించగా.. కేంద్రం, బ్యాంకుల నుంచి నిధులు రాగానే తిరిగి రాష్ట్ర బడ్జెట్కు ఖర్చు పెట్టిన నిధులు జమ చేస్తామని మంత్రి తెలిపారు.