పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లాలో ఓ చేప చర్చనీయాంశంగా మారింది. మొగల్తూరు మండలం సుబ్రమణ్యేశ్వరం రోడ్డులోని ఓ చెరువులో ఈ చేప (Fish) కనిపించింది. ప్రత్యేకత ఏమిటంటే… దీని నోరు తెరిచి చూస్తే మనిషి కింది దవడను తలపించే పళ్ల వరుస కనిపిస్తోంది. చూసినవారంతా ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు.ఇది చూడటానికి విచిత్రంగా ఉన్నా, అత్యంత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. చేతులు పెట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోకపోతే, ఈ చేప వేళ్లను బలంగా కొరికే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది ఆకట్టుకునే రూపంలో ఉన్నప్పటికీ, అసలు స్వభావం మాత్రం ఆగ్రహంగా ఉంటుంది.

పిరాన్హా జాతికి చెందిన రూప్చంద్ చేప
ఈ చేపపై నరసాపురం మత్స్య కళాశాల అసోసియేట్ డీన్ నీరజ కీలక విషయాలు వెల్లడించారు. ఇది రూప్చంద్ అని పిలవబడే చేప. ఇది ప్రమాదకరమైన పిరాన్హా జాతికి చెందినదని, పూర్తిగా మాంసాహార జీవిగా భావించాలన్నారు. దీని నోరులోని పళ్ల కూర్పు దీనికి ప్రత్యేకతను తీసుకొచ్చిందని తెలిపారు.
చెరువుల్లో పెంపకం – కానీ జాగ్రత్త తప్పనిసరి
ఈ చేపలు చెరువుల్లో సగటున రెండు నుంచి మూడు కిలోల వరకు బరువు పెరుగుతాయి. కొన్ని చోట్ల వీటిని వ్యాపార నిమిత్తం పెంచుతున్నారు. కానీ వాటిని చూసుకోవడం అంత సులువు కాదని నిపుణులు చెబుతున్నారు. కాస్త తేడా జరిగినా చేతులకు గాయం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
చూపరులకు ఆసక్తి – రైతులకు ఆందోళన
వింత పళ్లతో ఉన్న ఈ చేప ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే రైతులు మాత్రం దీని దూకుడు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలేకుండా పెంచితే, ప్రమాదం తప్పదని స్పష్టం చేస్తున్నారు.
Read Also : Govt Schools : తెలంగాణ లో కొత్తగా 157 సర్కారీ బడులు