Road accident in Vontimitta.. Three dead

Road Accident : ఒంటిమిట్టలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి వైపు నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం.. ఆర్టీసీ బస్సు, పోలీసు రక్షక వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

Advertisements
ఒంటిమిట్టలో రోడ్డు ప్రమాదం ముగ్గురు

అతివేగమే ప్రమాదానికి కారణం

ఈ ఘటనలో స్కార్పియోలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతులు నంద్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన వారిగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసు వాహనంలో ఉన్న కానిస్టేబుల్‌ రఘునాథరెడ్డితోపాటు డ్రైవర్‌కు తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. వారిని కడప రిమ్స్‌కు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం నుజ్జునుజ్జయిందని.. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు.

Read Also:  44 వేల ఎకరాలు కావాలట… చంద్రబాబుపై షర్మిల విమర్శలు

Related Posts
మాతృభాషను అందరూ మార్చిపోతున్నాం: కిషన్ రెడ్డి
Everyone is changing their mother tongue.. Kishan Reddy

న్యూఢిల్లీ: ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత Read more

గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశం
group2ap

గ్రూప్-2 వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదేశం ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని APPSC ని ఆదేశించింది. ఈ నెల 25వ తేదీన జరగాల్సిన Read more

బీసీలకు 42 శాతం రిజర్వేషన్: ఎంఎల్సీ కవిత
జగన్, చంద్రబాబులపై బీఆర్ఎస్ నేత కవిత ఆసక్తి కర వ్యాఖ్యలు

ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో వెనుకబడిన తరగతులకు కోటా సాధించడానికి తీసుకోవాల్సిన భవిష్యత్తు కార్యాచరణపై బీసీ సంఘాల నాయకులు మరియు తెలంగాణ జాగృతి చర్చించారుహైదరాబాద్: రాష్ట్రంలోని Read more

Myanmar Earthquake: మయన్మార్ భూకంపం: 3,085కి చేరిన మృతుల సంఖ్య
మయన్మార్ భూకంపం: 3,085కి చేరిన మృతుల సంఖ్య

మయన్మార్‌లో ఒక వారం క్రితం సంభవించిన భారీ భూకంపంలో మరింతగా మృతుల సంఖ్య పెరిగాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య 3,085కి చేరినట్లు సైనిక ప్రభుత్వం ప్రకటించింది. 7.7 Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×