Rising temperatures..Orange alert issued in Telangana!

Temperatures : పెరిగిన ఉష్ణోగ్రతలు..తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ!

Temperatures : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వచ్చే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం కూడా ఉంది. ఈరోజు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున 7 జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. హైదరాబాద్‌లో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

పెరిగిన ఉష్ణోగ్రతలు తెలంగాణలో ఆరెంజ్

కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు

ఏపీలోనూ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పెరిగినట్లుగా వాతావరణ కేంద్రం తెలిపింది. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రెంటచింతల ప్రాంతంలో సాధారణంగా మార్చి నెలలో 35 డిగ్రీల వరకు ఎండ ఉంటుంది. ఈసారి మాత్రం మార్చి మధ్యలోనే 42 డిగ్రీలు దాటిపోయింది. దాంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని అక్కడి జనం ఆందోళన చెందుతున్నారు. కోస్తాలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం అనూహ్యంగా మారుతోంది.

డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం

మార్చిలోనే భానుడు తన ప్రతాపంతో టాప్ లేపేస్తున్నాడు.. ఈ ప్రాంతం అ ప్రాంతం అని తేడాలేకుండా మంటలు పుట్టిస్తున్నాడు. దీంతో జనాలు అసమ్మర్ హీట్ ను బీట్ చేసేందుకు చల్ల చల్లని,కూల్ కూల్ గా వుండే ఫ్రూట్స్ , సమ్మర్ డ్రింక్స్ ను తీసుకుని ఎండ ప్రతాపాన్నికూల్ చేస్తున్నారు. మరో వైపు వేడి తీవ్రత అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, నీరసం, గుండెపోటు ప్రమాదాలు పెరుగుతాయి అంటున్నార వైద్య నిపుణులు. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.

Related Posts
Andhrapradesh: వర్మకు కీలక బాధ్యతలు
Andhrapradesh: వర్మకు కీలక బాధ్యతలు – ఏపీ రాజకీయాల్లో నూతన మలుపు

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గం పిఠాపురం. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోగా, 2024 ఎన్నికల్లో మాత్రం ఘన విజయం Read more

చిరంజీవి తల్లికి అస్వస్థత వార్తల్లో నిజం లేదు.
చిరంజీవి తల్లికి అస్వస్థత వార్తల్లో నిజం లేదు.

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని ఉదయం నుంచీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని, Read more

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ
AMIM Delhi

వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించనుంది. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీలో మైనారిటీ ఓట్లు Read more

మాదిగ అమరవీరుల సంస్మరణ సభ
మాదిగ అమరవీరుల సంస్మరణ సభ

మాదిగ అమరవీరుల సంస్మరణ సభ హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరుగుతున్న మాదిగ అమరవీరుల సంస్మరణ సభలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెలేలు కాలె యాదయ్య, Read more