IPL2025 :కుల్దీప్ ను నెట్టేసిన రిషబ్ పంత్‌

IPL2025 :కుల్దీప్ ను నెట్టేసిన రిషబ్ పంత్‌

ఐపీఎల్ 2025 సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైంది.ఐపీఎల్ 2025 మెగా వేలంలో, లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు.అయితే, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ప్రదర్శనను మరిచిపోలేనిదిగా మార్చుకున్నాడు.6 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.కెప్టెన్సీలోనూ కొన్ని తప్పులు చేశాడు.చివరి ఓవర్‌లో మోహిత్ శర్మ స్టంపింగ్‌ను మిస్ చేశాడు.

స్టేడియంలో సరదాగా

మ్యాచ్ ఒత్తిడిలో ఉన్నప్పటికీ, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ స్టేడియంలో సరదాగా హాస్యప్రధంగా కనిపించారు. వీరి మధ్య జరిగిన ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.18వ ఓవర్‌లో లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో,రెండో బంతిని ఢిల్లీ ఆటగాడు కుల్దీప్ యాదవ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ వికెట్ కీపర్ పంత్ చేతుల్లో పడింది.రిషబ్ పంత్ స్టంప్స్‌పై బంతిని కొట్టేందుకు ప్రయత్నించాడు, కానీ కుల్దీప్ క్రీజులోనే ఉన్నాడు.
సరదాగా పంత్, కుల్దీప్‌ను క్రీజు వెలుపలికి నెట్టి, వికెట్లపై బెయిల్స్ వేయడం జరిగింది.
ఇది మ్యాచ్ సమయంలో నవ్వు తెప్పించే ఘటనగా మారింది.

హై-వోల్టేజ్ పోరు

మ్యాచ్ పూర్తిగా లక్నో చేతి లోనే ఉన్నా, చివరి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అశుతోష్ శర్మ సిక్సర్ కొట్టి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. దీంతో లక్నో ఓటమిని తప్పించుకోలేకపోయింది.టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది.లక్నో బ్యాటింగ్‌లో నికోలస్ పూరన్ (75), మిచెల్ మార్ష్ (72) చెలరేగి ఆడారు.లక్నో సూపర్ జెయింట్స్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత తడబడినా, చివరి క్షణాల్లో మ్యాచ్ ఉత్కంఠ రేగింది.అశుతోష్ శర్మ (66) చివరి ఓవర్‌లో సిక్సర్ బాదడంతో, ఢిల్లీ మూడు బంతులు మిగిలి ఉండగానే గెలిచింది.

రిషబ్ పంత్ కెప్టెన్సీపై ఒత్తిడి

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంత్ డకౌట్ అయ్యాడు.కెప్టెన్సీలోనూ కీలకమైన తప్పిదాలు చేశాడు.ఫీల్డింగ్‌లో కూడా కొన్ని అవకాశాలను కోల్పోయాడు.ఈ ఓటమితో రిషబ్ పంత్ కెప్టెన్సీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. రాబోయే మ్యాచ్‌లలో పంత్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకుంటాడా,లేదా అతని కెప్టెన్సీపై ప్రశ్నలు ఉత్పన్నమవుతాయా, అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Posts
జనవరిలో 100వ మిషన్‌ ప్రయోగం: ఇస్రో చీఫ్‌
100th mission launch in January.. ISRO chief

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 2025లో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) ఎన్‌వీఎస్-02 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్‌ కోసం సన్నాహాలు Read more

ఉత్కర్ష్ ఒడిషా-మేక్ ఇన్ ఒడిషా కాన్‌క్లేవ్ లో పాల్గొననున్న మోదీ
narendra modi

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా రాష్ట్ర సామర్థ్యాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్కర్ష్ ఒడిషా-మేక్ ఇన్ ఒడిషా కాన్‌క్లేవ్ 2025ను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ Read more

ఆప్ అగ్రనేతలకు చావు దెబ్బ!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడి అవుతున్నా యి. బీజేపీ అధికారం ఖాయమైంది. ఆప్ ప్రముఖులు ఓటమి బాట పట్టారు. కేజ్రీవాల్ తో సహా డిప్యూటీ Read more

బంగాళాఖాతంలో భారీ భూకంపం
బంగాళాఖాతంలో భారీ భూకంపం

బంగాళాఖాతంలో మంగళవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలను ప్రభావితం చేశాయి. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *